స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా అల వైకుంఠపురములో. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడం, అదీకాక ఆ రెండు సినిమాలు కూడా మంచి హిట్స్ అందుకోవడంతో, తప్పకుండా ఈ సినిమా కూడా సక్సెస్ సాధించి, వారిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయం అని భావిస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. సీనియర్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సునీల్

 

నవదీప్, రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ, నివేత పేతురాజ్, అక్కినేని సుశాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి తొలి సాంగ్ గా రిలీజ్ అయిన సామజవరగమనా సాంగ్, యూట్యూబ్ లో రిలీజ్ అయిన క్షణం నుండి యూత్ ని విశేషంగా ఆకట్టుకుంటూ ఎంతో అద్భుతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే వ్యూస్ పరంగా ఎంతో గొప్పగా దూసుకుపోయిన ఈ సాంగ్, నేటితో 1 మిలియన్ లైక్స్ దక్కించుకుని, ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు దక్కని రికార్డుని సొంతం చేసుకుంది. 

 

ఇక ఈ విషయమై సినిమా యూనిట్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ తమ సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేసారు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే, తమ హీరో సాంగ్ కి దక్కిన ఈ అరుదైన ఘనతకు ఉబ్బితబ్బిబ్బవుతూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ న్యూస్ నేటి ఉదయం నుండి పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. కాగా ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: