తెలుగుతెర ‘సీతమ్మ’ గా ఒకనాటి అంజలీ దేవి తరువాత అలాంటి ఇమేజ్ తెచ్చుకున్న అంజలి రకరకాల కారణాలతో వివాదాలకు చిరునామాగా మారిపోయింది. దీనితో ఆమె టాలీవుడ్ కు దూరం అయి కోలీవుడ్ సినిమాలు చేస్తున్న పరిస్థితులలో ఆమెను ప్రేమలోకి దింపి ఆమె జీవితాన్ని తమిళ హీరో జై నాశనం చేసాడు అంటూ నిర్మాత నందకుమార్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు.

అంజలి జై లతో కలిసి గతంలో ‘బెలూన్’ మూవీని తీసిన ఈ నిర్మాత మాట్లాడుతూ తన మూవీ షూటింగ్ కోసం కొడైకనాల్ వెళ్ళినప్పుడు తాను వీరిద్దరి కోసం వేరువేరు గదులను బుక్ చేసినా వీరిద్దరూ ఒకే గదిలో ఉండేవారు అన్న విషయాన్ని బయటపెట్టాడు. అంతేకాదు సినిమాల పట్ల ఏకాగ్రత లేకుండా అంజలి మనసును పాడు చేసిన వ్యక్తి జై అంటూ అతడి పై ఈ నిర్మాత విరుచుకు పడుతున్నాడు. 

అయితే ఇప్పుడు అంజలి తాను చేసిన తప్పును గ్రహించుకుని జై ని దూరం పెట్టి సినిమాలు చేస్తున్న విషయాలను వివరిస్తూ ఈ నిర్మాత ఇప్పటికైనా అంజలి తన కెరియర్ పై దృష్టి పెడితే బాగుపడుతుంది అంటూ కామెంట్ చేసాడు. అంజలికి గతంలో తన పిన్నితో వచ్చిన వివాదాలతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దూరమైన విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం జై తో తన డేటింగ్ వ్యవహారానికి స్వస్తి చెప్పిన అంజలి తన సినిమా కెరియర్ పై శ్రద్ధ పెట్టి వరసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె తమిళ్ లో 5 తెలుగులో 2 సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీలో ఈమె అమెరికాకు చెందిన లేడీ పోలీసు ఆఫీసర్ గా చాల డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది దీనితో అంజలి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిందా అంటూ ఆమె అభిమానులు ఆనంద పడుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: