రౌడీ స్టార్ విజయ్ దేవరకొండరష్మిక కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. 2018లో టాలీవుడ్ కి లభించిన బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఈ సినిమా ఒకటి. ఎటువంటి అంచనాలు లేకుండా విడుడలైన ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి విజయ్ – రష్మికలను స్టార్లుగా మార్చేసంది. నిర్మాత అల్లు అరవింద్ కు ట్రిపుల్ టైమ్ ప్రాఫిట్స్.. దర్శకుడు పరశురామ్ కు కెరీర్ స్పాన్ ను ఇచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ రష్మికకు ఈ సినిమా సూపర్ బూస్టప్ ఇచ్చింది.

 

 

కానీ.. రష్మిక కంటే ముందు గీత పాత్ర మరో ముగ్గురు హీరోయిన్లను పలకరించింది. వాళ్లు కాదంటే వచ్చిన ఈ అవకాశాన్ని రష్మిక కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దర్శకుడు పరశురామ్ మొదట గీత పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించాడు. అప్పటికే ఆమె హిందీ చిత్రం దే దే ప్యార్ దే సినిమాకు డేట్స్ కేటాయించడంతో కాదనుకుంది. తర్వాత అను ఇమ్మానియేల్ ను సంప్రదిస్తే తాను నా పేరు సూర్య.. సినిమాకు పని చేస్తూ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. దీంతో పరశురామ్ రాశి ఖన్నాను సంప్రదించాడు. ఆమె ఈ సినిమాను కాదనుకుని నితిన్ సినిమా శ్రీనివాస కల్యాణంకు సైన్ చేసింది.

 

 

చివరకు చలో తో హిట్ అందుకున్న రష్మికను సెలెక్ట్ చేసుకున్నాడు. ‘గులాబి మొక్కకు అంటు కట్టినట్టు..’ అని ఓ సినిమా డైలాగ్. గీత గోవిందంను అదే రీతిలో తెరకెక్కించిన పరశురామ్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చేశాడు. దీంతో రష్మిక స్టార్ హీరోయిన్ అయిపోయింది. మహేశ్, అల్లు అర్జున్ సరసన చాన్స్ వచ్చేలా చేసింది. ఈ సినిమాలు హిట్ అయితే ఆమె కాల్షీట్లకు క్యూ కట్టాల్సిందే.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: