వి.వి.వినాయక్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. ‘ఆది’ సినిమాతో బాక్సాఫీసును షేక్ చేసిన ఈ కమర్షియల్ దర్శకుడు అనతికాలంలోనే స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఇక మాస్ చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఉన్న వి వి వినాయక్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. 'ఠాగూర్', 'ఖైదీ నెం:150' సినిమాల్లో కాసేపు తెరపై తళుక్కుమన్న వినాయక్‌ను పూర్తిస్థాయి హీరోగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ ద్వారా నిర్మాత దిల్ రాజు, లాంచ్ చేస్తున్నారు. ఆయన సీనయ్య అనే చిత్రంలో ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. 

 

ఈ చిత్రంలో వినాయక్ గ్యారేజ్ ఓనర్ లా కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో వినాయక్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. అయితే తాజాగా వివి వినాయక్ సీనయ్య సినిమాలో శ్రియను హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.  సీనయ్య సినిమాలో పాత్ర రీత్యా మరియు వినాయక్ కి జోడిగా శ్రీయా ఐతే బాగుంటుంది అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే శ్రియ ను సంప్రదించారని.. శ్రియ కూడా ఫార్మల్ గా తన పచ్చజెండా ఊపేసిందని సమాచారం.  పారితోషికం విషయంలో అంగీకారం కుదిరితే వినాయక్ తో రొమాన్స్ కు రెడీ అయినట్టే. 

 

అయితే గతంలో వినాయక్ దర్శకుడిగా తెరకెక్కించిన చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్ చిత్రాలతో శ్రీయా హీరోయిన్ గా నటించడం విశేషం. ఈ మ‌ధ్య కాలంలో శ్రియ పేరును మెగాస్టార్ చిరంజీవి, వెంక‌టేష్ సినిమాల‌కు హీరోయిన్‌గా ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ఇక  ఇప్పటి వరకు దర్శకుడిగా తెర వెనక యాక్షన్ చెప్పిన వినయ్.. ఇప్పుడు మరో దర్శకుడు యాక్షన్ చెప్తే, యాక్ట్ చెయ్యనున్నారు.  మ‌రి వీరిద్ద‌రి కాంబినేష‌న్ ఎలా ఉండ‌బోతుందో చూడాలి. కాగా, దర్శకుడు శంకర్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్. నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: