సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు మరోసారి తన సత్తా చాటాడు. టాలీవుడ్‌ లో టాప్‌ హీరోగా వెలుగొందుతున్న మహేష్, డిజిటల్‌ వ్యూస్‌ లో కూడా టాప్‌ స్టార్‌ గా అవతరించాడు. మహేష్ తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు" టీజర్‌, ఆన్లైన్‌ లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఈ టీజర్‌ సౌత్‌ లో తొలి 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన టీజర్‌ గా ఆల్‌ టైం రికార్డ్‌ కొల్లగొట్టింది.

మహేష్‌ బాబు హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సరిలేరు నీకెవ్వరు". సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్ర యూనిట్ సభ్యులు. తాజాగా ఈ సినిమా టీజర్‌ ను రిలీజ్‌ చేశారు. చాలా కాలం తర్వాత మహేష్‌ లోని మాస్‌ యాంగిల్‌ చూపించిన ఈ టీజర్‌ కు సూపర్బ్‌ రెస్సాన్స్‌ వస్తోంది. సౌత్‌ లో తొలి 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన టీజర్‌ గా సరిలేరు నీకెవ్వరు ఆల్‌ టైం రికార్డ్‌ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ టీజర్‌ కు 18 మిలియన్ల (కోటీ 80 లక్షల)కు పైగా వ్యూస్‌ వచ్చాయి.

 

Image result for sarileru neekevvaru

 

ఇన్నాళ్లు సౌత్‌ లో ఈ రికార్డ్‌ డార్లింగ్‌ ప్రభాస్‌ పేరున ఉండేది. బాహుబలి తర్వాత యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సినిమా సాహో. భారీ అంచనాల మధ్య, భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా టీజర్‌ యూట్యూబ్‌ లో సరికొత్త రికార్డ్‌లు సృష్టించింది. ఈ సినిమా టీజర్‌ కు తొలి 24 గంటల్లో 17 మిలియన్ల వ్యూస్‌ రావడం జరుగుతుంది. "సరిలేరు నీకెవ్వరు" టీజర్‌ రిలీజ్‌కు ముందు వరకు ఇదే ఆల్‌ టైం రికార్డ్‌. కోలీవుడ్‌ టాప్‌ హీరో విజయ్‌ ఈ లిస్ట్‌ లో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సౌత్‌ లో తిరుగులేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న స్టార్స్‌ లో దళపతి విజయ్‌ ఒకడు. అందుకే విజయ్‌ సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్‌ కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారుతుంటుంది. యూట్యూబ్‌ లోనూ విజయ్‌ రికార్డ్‌ లు అదే రేంజ్‌ లో ఉంటాయి. మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా తెరకెక్కిన సర్కార్‌ టీజర్‌ను 24 గంటల్లోనే 16 మిలియన్ల మంది చూశారు. అప్పట్లో ఇదే ఆల్‌ టైం రికార్డ్ కావటం విశేషం.

 

Image result for sarileru neekevvaru

 

ఈ లిస్ట్‌లో టాప్‌ - 5 లో రెండు స్థానాలు దక్కించుకున్నాడు సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు. ఫస్ట్‌ ప్లేస్‌ తో ఆల్‌ టైం రికార్డ్ సాధించిన మహేష్‌, మహర్షి సినిమాతో నాలుగు స్థానంలో కూడా తానే ఉన్నాడు. మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మెసేజ్‌ ఓరియంటెండ్‌ కమర్షియల్ సినిమా మహర్షి. ఈ సినిమా టీజర్‌ను తొలి 24 గంటల్లో 12.6 మిలియన్ల మంది వీక్షించారు. అయితే అప్పట్లో ఆల్‌ టైం రికార్డ్‌ సెట్‌ చేయటంలో ఫెయిల్‌ అయిన మహేష్. ఇప్పుడు "సరిలేరు నీకెవ్వరు" టీజర్‌ తో ఆ రికార్డ్ సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: