'ఊహలు గుసగుసలాడే' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా. ఆ తర్వాత చాలా మంచి అవకాశాలను దక్కించుకుంది. అందంతో పాటు అభినయం కనబరిచే నటి కావడంతో ఈమెకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అందుకే రాశీ ఖన్నా బడా హీరోల సరసన కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. దీంతో ఈమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. తాజాగా రాశీ తన అఫైర్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. 

 

మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో వెండితెరపై పరిచయమయిన రాశీ ఖన్నా. ఆ తర్వాత ఆమె తెలుగు, కన్నడం, తమిళం భాషా చిత్రాల్లో నటిస్తూ రాణిస్తోంది. ఒక పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోవైపు, మిగిలిన దక్షిణాది ఇండస్ట్రీల్లోనూ మెరుస్తోంది. దీంతో రాశీ ఖన్నా పాపులర్ హీరోయిన్ అయిపోయింది.

 

రాశీ ఖన్నా భారత క్రికెట్ జట్టు సభ్యుడు జస్ప్రీత్ బూమ్రాతో డేటింగ్ చేస్తుందని గతంలో వార్తలు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. దీనికి కారణం రాశీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఆ యంగ్ బౌలర్ ఫాలో అవడమే. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయిపోయింది. దీనిపై రాశీ కూడా క్లారిటీ ఇచ్చేసింది. ‘బూమ్రా, నేను స్నేహితులం మాత్రమే' అని ఓ కామెంట్ చేసి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టింది.

 

వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రాశీ ఖన్నా ఇటీవల ఓ ఇంగ్లీష్ మేగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎన్నో విషయాలు వెల్లడించింది. ‘గ్లామరస్ పాత్రలు చేయాలని చాలా మంది దర్శకులు ఒత్తిడి చేశారు. కానీ, నేను మాత్రం ప్రాముఖ్యత ఉన్న పాత్రలు మాత్రమే చేయాలని ఉంటుంది. అదీ కాక నా గ్లామర్ విషయంలో కొన్ని హద్దులు ఉన్నాయి' అని చెప్పింది.

 

అలాగే, తన లవ్ ఎఫైర్ల గురించి కూడా స్పందించింది. ‘నేను ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా డేటింగ్ పైన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. కానీ, నేను నా పదహారవ ఏటనే ఓ అబ్బాయితో డేటింగ్ చేశాను. అతడు నా క్లాస్‌మేట్. మా ఇద్దరి వయసు ఒకటే. తర్వాత ఇద్దరం దూరమయ్యాం' అని ఆమె వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: