నవంబర్ 22 వ తారీకు సాయంత్రం విడుదలైనా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా టీజర్ సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ‘భరత్ అనే నేను’ మరియు ‘మహర్షి’ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై అభిమానుల్లో భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది కమెడియన్లు మరియు అదే విధంగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటిస్తున్న క్రమంలో సినిమాపై ఇండస్ట్రీ లో కూడా మంచి ఆసక్తి నెలకొంది. ఇటువంటి నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గురించి లేటెస్ట్ గా ఇండస్ట్రీలో ఒక ట్రెండింగ్ న్యూస్ చక్కెర్లు కొడుతుంది.

 

అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లో మరియు విడుదలైన ఫోటోలలో ఎక్కువగా సూపర్ స్టార్ మహేష్ బాబు ని మాత్రమే హైలెట్ చేస్తున్న క్రమంలో సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి అనేక వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలో మహేష్ పక్కన హీరోయిన్ గా నటించిన రష్మిక మందన పాత్ర చాలా తక్కువ సమయం అని ఇందుమూలంగా అసలు హీరోయిన్ పాత్ర చూపించకుండా ముందు నుండే సినిమా ఆడియన్స్ కి మహేష్ పాత్ర పైన ఎక్కువ ఫోకస్ ఉండేటట్లు సినిమా టీజర్ మరియు ప్రమోషన్ విషయంలో పోస్టర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.

 

అందువల్లనే ఇటీవల విడుదలైన టీజర్ లో కూడా హీరోయిన్ పాత్ర సినిమా యూనిట్ చూపించినట్లు తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు సినిమా హీరోయిన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు అసలు సినిమాలో రష్మిక మందన నటిస్తుందా లేదా అన్న చర్చలు జరుగుతున్నాయి. మరి రష్మిక మందన పాత్ర సినిమాలో ఎంతమేరకు ఉందో తెలియాలంటే జనవరి 11 వరకు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: