టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని మరియు రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి కొన్నేళ్ల తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ రెండు రోజుల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ కావడం జరిగింది. 

 

అయితే రిలీజ్ అయిన మరుక్షణం నుండి టీజర్ కు విపరీతమైన వ్యూస్ మరియు లైక్స్ లభిస్తున్నాయి. ఇక ఈ టీజర్ ఫాస్ట్ గా 1 మిలియన్, 5 మిలియన్, 10 మిలియన్, 15 మిలియన్ తో పాటు ఫాస్టెస్ట్ గా 20 మిలియన్ వ్యూస్ తో పాటు ఇప్పటివరకు 430k లైక్స్ దక్కించుకుని ఇప్పటికీ కూడా ఇంకా యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. కేవలం 40 గంటల్లోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకున్న టీజర్ గా ఈ సరిలేరు నీకివ్వరు అత్యద్భుతమైన రికార్డు ని సొంతం చేసుకుంది. 

 

సూపర్ స్టార్ మహేష్ బాబు అటు ఆర్మీ మేజర్ గా, ఇటు కర్నూలు యువకుడిగా రెండు వేరియేషన్స్ లో టీజర్ లో కనపడడం, అలానే ఆయన పలికిన డైలాగ్స్ ఎంతో పవర్ఫుల్ గా అదిరిపోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా టీజర్ కు బ్రహ్మరథం పడుతున్నారు. మహేష్ బాబు 26వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. వరుసగా భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న మహేష్ బాబు, ఈ సినిమాతో ఎంత మేర హ్యాట్రిక్ సక్సెస్ ని అందుకుంటారో వేచి చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: