టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే చివరి దశ షూటింగ్ ని జరుపుకుంతోంది. నిన్న దర్శకుడు అనిల్ రావిపూడి బర్త్ డే ని సినిమా యూనిట్ ఎంతో ఘనంగా సెలెబ్రేట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోల్లో మహేష్ బాబు గారు, దర్శకుడు అనిల్ కు ఎంతో ఆనందంగా కేక్ తినిపించడం గమనించవచ్చు. టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి చాలా రోజుల తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా ఆమెను స్క్రీన్ పై చూడాలి అని ఎంతగానో ఉవ్విళ్లూరుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

 

ఇక రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అధికారిక టీజర్, ఇప్పటికే యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ తో దుమ్ముదులుపుతోంది. ఇకపోతే నిన్న తన పుట్టినరోజును పురస్కరించుకుని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకంగా ఒక ఇంటర్వూ ని ఇవ్వడం జరిగింది. ఇక ఆ ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ, వరుసగా రెండు సక్సెస్ లు కొట్టి మంచి జోష్ మీదున్న సూపర్ స్టార్ మహేష్ గారికి, తప్పకుండా ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తూ చెప్పారు. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కోరుకునే అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని, 

 

రేపు థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు నూటికి నూరుశాతం మంచి సినిమాను చూశామనే ఫీల్ తో బయటకు వెళ్తారని అనిల్ మాట్లాడుతూ చెప్పారు. ఇక ఈ సినిమా విషయమై ఇప్పటివరకు ఎవరికీ చెప్పని ఒక సంచలన నిజాన్ని అనిల్ బయట పెట్టడం జరిగింది. అదేమిటంటే, ఈ సినిమాలో నటుడు అజయ్ క్యారెక్టర్ రన్ అయ్యే సమయంలో ప్రేక్షకులు ఎవరూ కూడా ఊహించని ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ సీక్వెన్స్ ఉందని, అయితే దానిని అజయ్ ద్వారా సూపర్ స్టార్ మహేష్ గారిని రెప్రెసెంట్ చేస్తూ టాలీవుడ్ సినిమాల్లో చూసిన ఒక అద్భుతమైన పాత్రని ఒక సందర్భంలో చూపించడం జరిగిందని, అది చూసిన ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం ఖాయం అని అనిల్ తెలిపారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: