టాలీవుడ్ లో ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ బాధపెట్టేలా చేస్తుంది. అదేంటి హిట్టు సినిమా చూసి బాధపడటం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. అదంతే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని తెలియక వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకున్నారు సదరు హీరోయిన్స్.. తీరా చూస్తే అందులో నటించిన హీరోయిన్ జాతకమే మారిపోయే సరికి ఇప్పుడు అర్రే అని బాధపడుతున్నారు.

 

ఇంతకీ ఏంటా సినిమా ఎవరా హీరోయిన్స్ అని తెలుసుకోవాలి కదా.. అయితే మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే. విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వచ్చిన సినిమా గీతా గోవిందం. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అప్పటికే ఛలో హిట్ తో పర్వాలేదు అనిపించుకున్న రష్మిక గీతా గోవిందం హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ కాదని చెప్పారట.

 

అయితే అప్పట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇదే విషయాన్ని ప్రస్థావించారు. సినిమాలో హీరోయిన్ కోసం చాలామందిని అనుకున్నాం కాని వారెవరు చేయలేదని అన్నారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిన వారు తమకు తామే గీతా గోవిందం ఛాన్స్ అనవసరంగా మిస్ అయ్యామని అన్నారు. అందులో మొదటిగా చెప్పుకుంటే రకుల్ ప్రీత్ సింగ్ వస్తుంది. ఈమధ్యనే ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సినిమా కోసం గీతా గోవిందం సినిమా మిస్ అయ్యానని చెప్పింది.

 

ఇక గీతా గోవిందం సినిమా ఛాన్స్ వచ్చినా సరే వదులుకున్నా అని చెప్పింది లావణ్యా త్రిపాఠి. తనకు అంత గొప్ప అవకాశం వచ్చినా తను కాదని చెప్పానని.. ఆ టైంలో ఆ సినిమా చేయాలని అనిపించలేదని అన్నది లావణ్య. తను ఆ సినిమా మిస్సైనందుకు చాలా బాధపడుతున్నా అని అన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: