ఈ జనరేషన్ లో టాలీవుడ్ క్రేజీయస్ట్ కపుల్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది నాగ చైతన్యసమంత జంట. ఆఫ్ స్క్రీన్ లోనే కాకుండా ఆన్ స్క్రీన్ లో కూడా వీరిద్దరూ చూడ చక్కని జంటగా పేరు తెచ్చుకున్నారు. ఏం మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో కలిసి నటించారు. పెళ్లయ్యాక మజిలీ సినిమాలో నటించి మెప్పించారు. ఇప్పుడు ఈ జంట మళ్లీ ఆన్ స్క్రీన్ పై కలిసి నటించనున్నారని తెలుస్తోంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా రానున్న సినిమాలో ఈ జంట మళ్లీ కనువిందు చేస్తారని ఫిల్మ్ నగర్ లేటెస్ట్ సమాచారం.

 

 

మజిలీ తర్వాత పలువురు దర్శకులు భూపతి వీరిద్దరి జోడీతో సినిమా చేయాలని చర్చలు జరిపినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. మళ్లీ ఇద్దరం కలిసి నటించబోమని, వేర్వేరుగానే సినిమాలు చేస్తామని సమంత కూడా చెప్పినట్టు వార్తలు షికారు చేశాయి. కానీ నాగ్ ఎంతో ఇంటరెస్ట్ చూపిస్తున్న బంగార్రాజు సినిమాలో వీరిద్దరూ కలిసి సందడి చేయనున్నారని అంటున్నారు. దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఎప్పటినుంచో ఈ కథపై వర్క్ చేస్తున్నాడు. ఈ కథ ఇప్పటికే ఫైనల్ అయిందని నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యమని తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే బంగార్రాజు వీరిద్దరూ కలిసి నటించే ఐదో సినిమా అవుతుంది.

 

 

2010లో వచ్చిన ఏం మాయ చేశావే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. సమంతకు ఇదే మొదటి సినిమా. ఆ సినిమా నుంచి మొదలైన వీరి పరిచయం స్నేహంగా మారి ప్రేమకు దారి తీసింది. ఏడేళ్ల ప్రేమకు గుర్తుగా 2017లో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లయ్యాక కూడా సమంత మంచి అవకాశాలే దక్కించుకుంటోంది. ఇంకా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి నిదర్శనం రంగస్థలం, మజిలీ ఓబేబీ, యూటర్న్ సినిమాలే.

మరింత సమాచారం తెలుసుకోండి: