'సరిలేరు నీకెవ్వరు' అంటూ ఫాన్స్ ప్రిన్స్ మహేష్ బాబు ను తెగ పొగిడేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఊహకందని ఆసక్తి తో పాన్ ఇండియా గా బరిలోకి వచ్చిన సాహో మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. సాహో ప్లాప్ అయిన కొన్ని రికార్డ్స్ సాహో ధాటికి బద్దలు అయ్యాయి. అందులో సాహో టీజర్ ఒకటి ఈ మూవీ టీజర్ విడుదలైన కేవలం 24 నిమిషాల్లోనే లక్ష వ్యూస్ సాధించింది. 

టాలీవుడ్ లో ఒక మూవీ టీజర్ ఇంత తక్కువ సమయంలో లక్ష వ్యూస్ సాధించింది ఇప్పటి వరకు ఇదే కాగా తాజాగా మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ కేవలం 18 నిమిషాల్లోనే లక్ష వ్యూస్ సాధించింది. సాహో మూవీ సాధించిన రికార్డును ఇప్పట్లో ఏ సినిమా బ్రేక్ చెయ్యలేదు అనుకున్నా మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఇక దక్షిణ భారత దేశంలో అతి తక్కువ సమయంలో లక్ష వ్యూస్ సాధించిన సినిమా మెర్సల్ ఇది తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన సినిమా. ఈ సినిమా కేవలం 10 నిమిషాల్లోనే లక్ష వ్యూస్ సాధించింది. 

ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించగా, అట్లీ, కెవి విజయేంద్ర ప్రసాద్ మరియు ఎస్ రమణ గిరివాసన్ రచనా దర్శకత్వం వహించారు, ఇందులో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో నిత్యా మీనన్, సమంతా అక్కినేని, మరియు కాజల్ అగర్వాల్ నటించారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిలేరు నీకెవ్వరు ఒకటి, ఇందులో మహేష్ బాబు, రష్మిక మందాన ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ రావిపుడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 11 న థియేటర్లలోకి రానుంది. ఇక ఈ చిత్రానికి పోటీగా అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: