ప్రతీ ఏడాది సంక్రాంతి వస్తుందంటే..టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది. స్టార్ హీరోలందరు తమ సినిమాలు ఆ సీజన్ లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తుంటారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజ్ రోజున భారీ ఎత్తున థియేటర్ల లో తమ సినిమాను విడుదల చేసి.. మొదటి వారంలోనే మొత్తాన్ని రాబట్టేసుకునే విధానాన్ని ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు తగ్గట్లే రిలీజ్ క్లాష్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు స్టార్ ప్రొడ్యూసర్స్.

 

సంక్రాంతి సీజన్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావించే ఈ పెద్ద నిర్మాతల మధ్య పోటీ అనివార్యంగా మారుతుంటోంది అప్పుడప్పడు. అలాగే 2020 సంక్రాంతికి ఇలాంటి పరిస్థితే ఉంది. ముందు ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల విషయంలో పోటీ పడతాయాన్న సస్పెన్స్ లో క్లారిటి వచ్చేసింది. రాజీ ఫార్ములా ను ఫాలో కావటం తెలిసిందే. దీంతో రిలీజ్ వార్ కు పుల్ స్టాప్ పడుతోంది. మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలు జనవరి 12న విడుదల అవుతాయని ప్రకటించారు. కానీ.. తర్వాత జరిగిన చర్చల కారణంగా రిలీజ్ డేట్ మార్చుకున్నారు.

 

మరి.. ఈ విషయం లో దిల్ రాజు ఏం చేశారు? తన సినిమా సరిలేరునీకెవ్వరు ముందు రిలీజ్ అయ్యేలా.. ఆ తర్వాతి రోజు అల్లు అర్జున్ సినిమా విడుదలయ్యేలా ఏం చేశారన్న దిల్ రాజు ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కన్వీన్స్ చేశారా? కన్వీన్స్ అయ్యారా? అన్న సందేహానికి సమాధానం ఇస్తూ.. ఏదైనా విషయం ఒకటేగా అంటూ సమాధానమిచ్చారు. రెండు పెద్ద సినిమాలే అన్న దిల్ రాజు నిర్మాతల గిల్డు జరిపిన చర్చల్లో తాము కన్వీన్స్ అయినట్లుగా పేర్కొన్నారు. తెర వెనుక ఏం జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పకుండానే విషయాన్ని పక్కకు పెట్టేసిన ఆయన తీరు చూస్తే.. ఇలాంటిదే ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరిగేలా చేస్తుందని అర్థమవుతోంది. అయితే ఇక్కడ మహేష్ పాపు పప్పులు ఉడకలేదా అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆయన ఒక్కసారి కమిటయితే ఎవరి మాట వినరు కదా..అంటు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: