హ్యాపీ డేస్ ఫేమ్ నిఖిల్ నటిస్తున్న అర్జున్ సురవరం వాయిదాలు పడుతూ పడుతూ చివరికి ఈ నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, ఈ చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 26 న హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించాలని చిత్ర నిర్మాతలు యోచిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. వాస్తవానికి, చిరు ఈ చిత్రాన్ని ప్రత్యేక స్క్రీనింగ్‌లో చూశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానం మేరకు అర్జున్ సురవరం చిత్ర బృందం చిరు ఇంటికి వెళ్లగా సినిమా తనకు చాలా బాగా నచ్చిందని చిరు చెప్పినట్లు నిఖిల్ మీడియా కు వెల్లడించారు. 

కానీ, ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అనేదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఇటీవల, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమక్షంలో పీపుల్స్ ప్లాజాలో జరగాల్సిన జార్జ్ రెడ్డి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు నో చెప్పిన తెలంగాణ ప్రభుత్వం చిరు కు ఒకే చెప్తుందా అని అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

అర్జున్ సురవరం హీరో నిఖిల్ తన సినిమా ప్రీ రిజీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారన్న ఆనందాన్ని నిఖిల్ తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో చెప్పారు. ‘‘నా ఎగ్జైట్‌మెంట్ కంట్రోల్ అవ్వట్లే.. గ్యాంగ్ లీడర్‌లో చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో, రఫ్ ఆడిస్తా డైలాగ్ స్కూల్ మొత్తం చెప్పుకుంటూ తిరిగేవాడిని. ఈరోజు ఆ చేయిని పట్టుకునే అదృష్టం దక్కింది. 26న జరిగే ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నా దేవుడు వస్తున్నారన్న విషయం ఇప్పటికీ నాకు షాక్‌గానే ఉంది’’ అని ట్వీట్‌లో నిఖిల్ పేర్కొన్నారు. ఇక ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్. పోసాని కృష్ణముర‌ళి, సత్య, త‌రుణ్ అరోరా, వెన్నెల కిషోర్, నాగినీడు, విద్యుల్లేఖ రామన్ తదితరులు న‌టించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: