ఉహలు గుస గుసలాడే సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న‌ హీరోయిన్ రాశి ఖన్నా. ఆ తర్వాత వరసబెట్టి జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఒక్క ఎన్టీఆర్ తప్ప మరే స్టార్ హీరోతోనూ ఈమె నటించలేదు.

 

కెరీర్ మొద‌ట్లో కొంచెం అందాలు అరబోసే పాత్రలు చేసినప్పటికి తొలిప్రేమ చిత్రంతో నటనకు స్కోప్ ఉన్న పాత్రల్ని ఎందుకోవడం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ’ప్రతీరోజూ పండగే’, ’వెంకీమామ’, ’వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి క్రేజీ మూవీస్ లో నటిస్తోంది. తెలుగు తో పాటు తమిళంలో కూడా వరస సినిమాలు రాశి ఖన్నా చేస్తోంది.

 

ఇది ఇలా ఉంటే తాజాగా తన డ్రీం ప్రాజెక్ట్స్ గురించి అలానే డేటింగ్ గురించి చెప్పుకొచ్చింది. రాశి మాట్లాడుతూ.. “ప్రస్తుతం నేను కమర్షియల్ హంగులున్న పాత్ర‌ల‌కే ప్రాధాన్య‌త నిస్తున్నాన‌ని అయితే మంచి సామాజిక బాధ్యత కలిగిన పాత్రల్లో చేయాలన్నది నా కోరిక. ఇక గ్లామర్ విషయంలో నాకు కొన్ని హద్దులు ఉన్నాయి. అందుకే గ్లామరస్ పాత్రల్లో నటించమని కొందరు దర్శకులు ఒత్తిడి చేసినప్పటికి ఆ పాత్రలను ఒప్పుకోవడం లేదు.

 

ఇంకా ఫ్యూచ‌ర్లో మాత్రం మంచి సందేశాత్మక చిత్రాలలో నటిస్తాను. అలానే చాలా మంది డేటింగ్ గురించి అడుగుతున్నారు. 16వ ఏటలోనే ఓ అబ్బాయితో డేటింగ్ చేశాను. ఆ కుర్రాడి వయసు కూడా అప్పుడు 16 ఏళ్ళే.” అంటూ ఓపెన్ గా చెప్పి షాక్ ఇచ్చింది రాశి.

 

తాజాగా రాశి టిక్‌టాక్‌కు బానిస అయింది నిజ జీవితంలో కాదు.. సినిమాలో భాగంగా.. ప్రస్తుతం ఈ భామ.. మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తోంది. మారుతి తన సినిమాల్లో హీరోలకు ఏదో ఒక ప్రాబ్లెమ్‌తో బాధపడుతుంటాడు. అలాగే ఈ సినిమాలో హీరోకు కాకుండా హీరోయిన్‌‌కు  టిక్ టాక్‌కు బానిస అయిన ఒక అమ్మాయి క్యారెక్టర్‌లో నటించబోతున్నట్టు మారుతి రాశిఖన్నా క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: