టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం ఆయన కెరీర్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఇప్పటివరకు కెరీర్ పరంగా తీసిన నాలుగు సినిమాలతో కూడా సూపర్ సక్సెస్ లు అందుకున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. సూపర్ స్టార్ సరసన తొలిసారి రష్మిక మందన్న జోడి కడుతున్న ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి గారు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. 

 

రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, సంగీత, బండ్ల గణేష్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర లు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరుగుతోంది. కాగా ఈ సినిమాలో కీలకమైన విజయశాంతి పాత్రను గురించి ఒక సంచలన న్యూస్ ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. కాగా ప్రచారం అవుతున్న ఆ వార్తను బట్టి, ఈ సినిమాలో ప్రొఫెసర్ భారతిగా కనపడే విజయశాంతి, హీరో మహేష్ బాబుతో పాటు ఆర్మీలో పని చేసే టీమ్ సభ్యుడైన సత్యదేవ్ తల్లి పాత్రలో నటిస్తోందని, 

 

నిజానికి సినిమాలో అనుకోకుండా పాక్ తో యుద్ధ సమయంలో సత్యదేవ్ చనిపోతాడని, కాగా అతనికి ప్రభుత్వం తరపున కొంత భూమి రావడం, ఆ భూమిని ప్రకాష్ రాజ్ గ్యాంగ్ కబ్జా చేయాలని చూడడంతో ఆమె కోర్ట్ ని ఆశ్రయించి పోరాడుతుందని, ఆ సమయంలో ఆమెకు మరియు ప్రకాష్ రాజ్, మహేష్ కు మధ్య వచ్చే సీన్స్ సూపర్బ్ గా ఉంటాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఎంతో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై సరిలేరు టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ దుమ్ము దులుపుతోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయబోతోంది సినిమా యూనిట్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: