టాలీవుడ్ యువ దర్శకుల్లో ప్రస్తుతం మంచి సక్సెస్ లతో వరుసగా దూసుకువెళ్తున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమా ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయిన అనిల్ రావిపూడి, తొలిచిత్రంతో పాటు రెండ విఘ్నాన్ని కూడా సుప్రీమ్ రూపంలో సునాయాసంగా అధికమించారు. ఇక తొలి రెండు సినిమాల సూపర్ హిట్స్ తరువాత, రవితేజతో కొంత ప్రయోగాత్మకంగా పలు కమర్షియల్ అంశాలు మిళితం చేసి ఆయన తీసిన రాజా ది గ్రేట్ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవల విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కలయికలో ఆయన తీసిన ఎఫ్2 సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టి అనిల్ రావిపూడికి వరుస విజయాల దర్శకుడిగా పేరు తీసుకురావడం జరిగింది. 

 

ఇక ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు అనే సినిమాను తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి, ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాను అంటున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఆయన నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయితే తన లైఫ్ లో కొన్ని ఫన్నీ సీన్స్ తో పాటు ఫ్రస్ట్రేషన్ తెప్పించిన ఘటనలు కూడా ఉన్నాయని అనిల్ తెలిపారు. 

 

ఇక ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆయన తెరకెక్కించిన సుప్రీం సినిమాలో మికాయిల్ అనే చిన్న బాబు ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. తన సినిమా కెరీర్ మొత్తంలో ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆ బాబుతో పడిన బాధ అంతా ఇంతా కాదని, ఏదైనా షాట్ రెడీ అయ్యే సమయంలో బాబు ఆడుకుంటూ ఉండేవాడని, ఎక్కువగా నవ్వుతూ, అటు ఇటు గెంతుతూ ఉండేవాడని, దానివలన కొన్ని యాక్షన్ సీన్స్ తీసే సమయంలో తనకు నరకంగా అనిపించిందని, అయితే ఎంతైనా చిన్న బాబు, మరియు ఆ వయసులో ఎవరైనా అంతే ఉంటారని, కాకపోతే పిల్లలతో సినిమాలో సీన్స్ తీయడం ఎంత కష్టమో తనకు అప్పుడే పూర్తిగా అర్ధం అయిందని అనిల్ చెప్పుకొచ్చారు...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: