‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ కేవలం ఒకేరోజులో 18 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న తరువాత అదే స్పీడ్ ను కొనసాగిస్తూ దూసుకు పోతున్న నేపధ్యంలో ఈ మూవీ టీజర్ క్రియేట్ చేస్తున్న రికార్డులు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ టీజర్ కు పాకిస్తాన్ నుండి కూడ క్లిక్ లు రావడం హాట్ టాపిక్ గా మారింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబుకు అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఆఖరికి గల్ఫ్ దేశాలలో అభిమానులు ఉంటారు కాని పాకిస్తాన్ లో మహేష్ కు అభిమానులు ఎలా ఉంటారు అంటూ చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. అంతేకాదు దక్షిణాది హీరోల సినిమాలు చూడని పాకిస్తాన్ ప్రజల నుండి ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ కు లక్షల సంఖ్యలో క్లిక్స్ రావడంతో ఈ క్లిక్స్ వెనుక ఎదో ఒక కుంబకోణం జరిగింది అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. 

టాప్ హీరోల సినిమాల సోషల్ మీడియా ప్రమోషన్ కు ప్రత్యేకమైన టీమ్స్ ను ఏర్పాటు చేసి ఆ ప్రమోషన్ గురించి లక్షల స్థాయిలో భారీగా ఖర్చు పెడతారు అన్నది ఓపెన్ సీక్రెట్. అంతేకాదు టాప్ హీరోల సినిమాల టీజర్ లకు ట్రైలర్లకు లక్షల సంఖ్యలో హిట్స్ రావడానికి కూడ కొన్ని ప్రత్యేకమైన టీమ్స్ ను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేసి నమ్మశక్యం కాని యూట్యూబ్ లు రికార్డుల కోసం కూడ భారీ మొత్తాలను ఖర్చు పెడుతున్నారు. 

ఇప్పుడు అదే విధానం మహేష్ సినిమాకు కూడ అనుసరించడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ కు పాకిస్తాన్ నుండి క్లిక్స్ వచ్చాయా అంటూ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఒక టాప్ హీరో సినిమా విజయం ఆ సినిమా ప్రేక్షకుడుకి నచ్చే పరిస్థితి బట్టి ఉంటుంది కాని యూట్యూబ్ రికార్డుల వల్ల టాప్ హీరోల సినిమాలు ఎలా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి అంటూ మహేష్ సినిమా టీజర్ కు పాకిస్తాన్ నుండి వచ్చిన క్లిక్స్ ను ఆధారంగా చేసుకుని కొందరు మహేష్ కూడ మోసం చేస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: