మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ కధ అంతా రాయల సీమ కర్నూల్ ప్రాంతం నేపధ్యంలో జరుగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు ప్రాంతంలో జరిగినట్లుగా ఈ మూవీలో చూపించబోతున్నారు. దీనికోసం హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో కొండారెడ్డి బురుజు పోలిన భారీ సెట్ వేసి ఈ మూవీలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. 

దీనితో కర్నూల్ ప్రాంతంలోని మహేష్ అభిమానులకు ఒక కోరిక పుట్టి ఆకోరికను తీర్చమని మహేష్ కు వేలాది సంఖ్యలో మెసేజ్ లు పెడుతున్నట్లు టాక్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను కర్నూల్ లోని ఓపెన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయమని దీనివల్ల ఈ సినిమాకు సంబంధించి రాయలసీమ ప్రాంతంలోని మహేష్ అభిమానులలో మంచి జోష్ ఏర్పడటమే కాకుండా ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ ఈ ప్రాంతం నుండి వస్తాయి అంటూ అభిమానులు మహేష్ కు సూచిస్తున్నట్లు టాక్.

గతంలో ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ మూవీ విషయంలో కూడ ఇలాగే ఆ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఉయ్యాలవాడ గ్రామ ప్రాంతంలో ఏర్పాటు చేయమని చిరంజీవి అభిమానులు అడిగినా ఆ కోరికను మెగా స్టార్ తీర్చలేకపోయాడు. దీనితో ఇప్పుడు మహేష్ తన అభిమానుల ఈ చిరు కోరికను తీర్చగాలడా లేదా అంటూ అనేక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ఇది ఇలా ఉండగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను డిసెంబర్ ఆఖరి వారంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఫంక్షన్ అయిన తరువాత ఈ మూవీకి సంబంధించిన మరో ప్రమోషన్ కార్యక్రమాన్ని విజయవాడలో చేయడానికి కూడ ప్లాన్ చేస్తున్నారు. దీనితో విజయవాడ బదులు మహేష్ కర్నూల్ ను ఎంచుకుని తన అభిమానుల కోరిక తీరుస్తాడా లేదా అన్నది రాబోయే రోజులలో మాత్రమే తెలుస్తుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: