దాదాపు 10 సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టాడు తమన్. మొదట్లో చిన్న సినిమాలకు సంగీతం అందించిన తమన్ కు కిక్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. కిక్ సినిమా పాటలు హిట్ కావటంతో స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించే అవకాశాలు తమన్ కు వచ్చాయి. తమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 
 
ప్రస్తుతం తమన్ అల వైకుంఠపురములో, వెంకీ మామ, డిస్కో రాజా సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. అల వైకుంఠపురములో సినిమా నుండి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. ఈ మూడు పాటలలో సామజవరగమన, రాములో రాములా పాటలు మ్యూజికల్ గా పెద్ద హిట్ అయ్యాయి. అల వైకుంఠపురములో సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 
 
కానీ తమన్ పై చాలా సందర్భాల్లో కాపీ క్యాట్ అనే ఆరోపణలు వినిపించాయి. కొందరు తమన్ సంగీతం అందించిన సినిమాలలోని పాటలు విడుదల కాగానే తమన్ కాపీ కొట్టాడని వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ 
ఉన్నారు. ఈ విమర్శల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్ స్పందించారు. తమన్ మాట్లాడుతూ తాను విమర్శలను అస్సలు పట్టించుకోనని చెప్పారు. 
 
తనపై విమర్శలు చేయటం ద్వారా కొందరు డబ్బులు సంపాదిస్తున్నారని తెలిసిందని తమన్ చెప్పారు. తనపై వస్తున్న విమర్శలను వారి సంపాదనను దెబ్బ కొట్టడం ఇష్టం లేనందువలనే పట్టించుకోవడం లేదని తమన్ చెప్పారు. హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు తనపై నమ్మకం ఉందని అలాంటప్పుడు ఇతరుల విమర్శలను ఎందుకు పట్టించుకోవాలని తమన్ అన్నారు. తమన్ సంగీతం అందించిన అల వైకుంఠపురములో సినిమా 2020 జనవరి 12వ తేదీన విడుదల కాబోతుంది. డిస్కో రాజా డిసెంబర్ 20వ తేదీన విడుదల కానుండగా వెంకీ మామ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: