టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది తనను వాడుకుంటే చుక్కలు చూపిస్తానంటూ చిందులు వేసింది. ఇక శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో ఎవరికి తెలీదు. ఒక్కోసారి తమిళ్ ఇండస్ట్రీ ని కూడా టార్గెట్ చేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి. ఇక ఇటీవల హీరో నాని పై ఐటీ రైడ్స్ జరిగిన నేపథ్యంలో నాని పై పలు కామెంట్స్ చేసింది ఈ వివాదాస్పద నటి. 

ఇక తాజాగా ఏకంగా మీడియానే టార్గెట్ చేసింది ఈమె. ఉన్నట్లుండి ఎందుకో తెలియదు కానీ మీడియా వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి. తన ఫేసుబుక్ అకౌంట్ లో "ఇప్పట్నుంచి చెబుతున్నా తెలుగు, తమిళ యూ ట్యూబ్ ఛానెల్స్.. ఎవరైనా కానీ నా వీడియోలు స్పూఫ్ చేసి వాడుకున్నారంటే మీకు చుక్కలు చూపిస్తా. అలా కానీ నన్ను వాడేసారంటే ఏం చేస్తానో చెప్పను.. చేసి చూపిస్తా" అంటూ వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి. అసలు శ్రీ రెడ్డి ని ఇంత పెద్ద సెలబ్రిటీ ని చేసిందే మీడియా మరియు యూట్యూబ్ అలాంటి మీడియా నే టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి. ప్రతిరోజు శ్రీ రెడ్డి గురించి సోషల్ మీడియా మరియు యూట్యూబ్ లో ఏదో ఒక వార్త ఉంటూనే ఉంటుంది. ఇక ఇంతలా శ్రీ రెడ్డి ని ఫేమస్ చేసిన మీడియా కు ఝలక్ ఇవ్వడంతో మీడియా అవాక్కైంది. 

ఇక నెటిజన్స్ శ్రీ రెడ్డి వార్నింగ్ ను జోక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముందు నువ్వు నిక్కచ్చిగా ఉంటే ఎవరూ నీ జోలికి రారు కదా అంటూ నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. ఫేస్ బుక్ పేజీలో హీరోలు, నిర్మాతలు, దర్శకుల పేర్లు పెట్టి మరీ ఇష్టమొచ్చినట్లు తిట్టే నువ్వు కూడా నీతులు చెప్తున్నావా శ్రీ రెడ్డి మరికొందరు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక దీనిపై శ్రీ రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: