తెలుగులో వస్తున్న పాపులర్ కామెడీ షో ‘జబర్ధస్త్’ గత ఏడేళ్లుగా నాన్ స్టాప్ గా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ప్రోగ్రామ్.  ప్రతివారం కొత్త కొత్త స్కిట్స్ తో తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తున్న ‘జబర్ధస్త్’ లో ఇప్పుడు పెను మార్పులు చేర్పులు జరగబోతున్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా గత ఏడేళ్ల నుంచి ‘జబర్ధస్త్’ లో జడ్జీగా వ్యవహరిస్తున్న నాగాబాబు ఈ కామేడీ షోకి గుడ్ బాయ్ చెప్పేశారు.  ఆయనతో పాలు యాంకర్ అనసూయ కూడా తప్పుకుంటున్నట్లు తెలుస్తంది. 

 

 అయితే వీరితో పాటు చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ మరికొంత మంది ‘జబర్ధస్త్’ కి గుడ్ బాయ్ చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  దాంతో ‘జబర్ధస్త్’ పై నీలి నీడలు కమ్ముకున్నాయి...ముఖ్యమైన టీమ్ మెంబర్స్ వెళ్లిపోతే ఎలా ఈ కార్యక్రమాన్ని సాగిస్తారు అన్న అనుకుంటున్నారు.  కాకపోతే కొంత కాలంగా ‘జబర్ధస్త్’ హైపర్ ఆది చేస్తున్న సెన్సేషన్ అంతా ఇంతాకాదు.  రైజింగ్ రాజు, దొరబాబు లతో కలిసి హైపర్ ఆది చేస్తున్న స్కిట్స్ కి మంచి ఆదరణ లభిస్తుంది.  

 

యూట్యూబ్ లో ఎన్నో లైక్స్ కూడా రావడం విశేషం. అంతా పాపులారిటీ ఉన్న హైపర్ ఆదికి నాగబాబు తో మంచి అనుబంధం ఉంది.  జనసేన అధ్యక్షులు, నటుడు పవన్ కళ్యాన్ పరమ భక్తుడు అయిన హైపర్ ఆది సైతం ‘జబర్ధస్త్’ వెళ్లిపోతాడని వార్తలు వచ్చాయి.  అయితే హైపర్ ఆది 'జబర్దస్త్'లోనే ఉంటున్నాడనే విషయాన్ని, వచ్చేవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో స్పష్టం చేసింది. 

 

ఎందుకంటే 'మల్లెమాల'వారితో అగ్రిమెంట్ వున్న కారణంగానే, హైపర్ ఆది బయటికి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. 'జబర్దస్త్' దర్శకులతోను, నాగబాబుతోను హైపర్ ఆదికి మంచి సాన్నిహిత్యం వున్న ఆది ఒకవేళ అగ్రిమెంట్ పూర్తయితే తప్పకుండా నిష్క్రమిస్తాడని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: