టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు తన కెరీర్ లో తొలిసారి మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ ని తమ్మిరాజు అందిస్తుండగా, రత్నవేలు కెమెరా మ్యాన్ పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఇంట్రో టీజర్, 

 

పోస్టర్లు మరియు అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్స్ ఆడియన్స్ లో సినిమాపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయబోతోంది సినిమా యూనిట్. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్ అయినట్లు నేడు పలు టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అందుతున్న ఆ వార్తలను బట్టి, సినిమా రిలీజ్ కు సరిగ్గా వారం రోజుల ముందు, 

 

అనగా జనవరి 5న హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసిందట సినిమా యూనిట్. సినిమా యూనిట్ సభ్యులతో పాటు టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు హాజరు కాబోయే ఈ ఈవెంట్ కి భారీ స్థాయిలో ఖర్చు కూడా పెట్టనున్నట్లు టాక్. ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి కొన్నేళ్ల తరువాత నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు సీనియర్ నటి విజయశాంతి. రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హరితేజ, సంగీత తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కామెడీ, యాక్షన్, మాస్ ఎలెమెంట్స్ వంటివి అన్ని కలగలిపి దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కస్తున్నట్లు సమాచారం....!!

మరింత సమాచారం తెలుసుకోండి: