మహేష్ బాబు కెరియర్లో 'ఒక్కడు' సినిమా ఒక మైలురాయి అని చెప్పవచ్చు. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఒక్కడు' మహేష్ బాబు కి మంచి స్టార్ డమ్ తీసుకొచ్చింది. కాగా సినిమాలో కర్నూలు ప్రాంతం చుట్టూ తిరిగే స్టోరీ నేపద్యంలో కర్నూలు నుండి భూమికను తీసుకువచ్చే క్రమంలో మహేష్ బాబు ...విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో చేసిన సన్నివేశాలు సినిమాకి హైలైట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కొండారెడ్డి బురుజు సెంటర్లో ప్రకాష్ రాజ్ ని మహేష్ బాబు గట్టిగా పంచ్ ఇచ్చే టట్లు కొట్టడం...అదే స్థాయిలో ప్రకాష్ రాజ్...మహేష్ బాబు ని వెంటాడి పట్టుకోవటం ...దారి మధ్యలో సెంటర్లో రాయలసీమ ప్రాంత వాసుల మధ్య మహేష్ తో చెప్పే డైలాగులు సినిమాకే హైలెట్.

 

అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నామ్ అంటే….ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లో...మహేష్ బాబు కర్నూలు ప్రాంతంలో కొండారెడ్డి బురుజు సెంటర్లో నిలబడి డైలాగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది.

 

అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇదే కొండారెడ్డి బురుజు సెంటర్లో...మహేష్ బాబు సినిమాలో ప్రకాష్ రాజ్ తో చెప్పే డైలాగులు ఉంటాయి అవి ఒక్కడు సినిమా నీ గుర్తు తెచ్చే విధంగా ఉంటాయని సినిమా ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. ఇప్పటికే టీజర్లో ప్రకాష్ రాజ్ నటన చూస్తుంటే అప్పట్లో ఒక్కడు సినిమాలో నటించిన నటన విధంగా ఉన్నది. దీంతో తాజాగా వచ్చిన వార్త బట్టి చూస్తుంటే సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా ఒక్కడు సినిమా మాదిరిగానే ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: