‘బాహుబలి’ వంటి భారీ విజయం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘RRR’ సినిమాపై దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ కు భీభత్సమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే రెండు పెద్ద కుటుంబాలకు చెందిన స్టార్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మొట్టమొదటిసారి కలసి నటిస్తున్న నేపథ్యంలో సౌత్ ఇండియా లోనే ఈ సినిమా అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా అని చాలా మంది సినిమా ప్రముఖులు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా….కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ విషయం అందరికీ తెలిసినదే.

 

అయితే సినిమాలో ఇంకా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కూడా నటిస్తున్నారు. రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తుండగా. ..ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అంతేకాకుండా అజయ్ దేవగన్ మరియు అదే విధంగా తమిళ ఇండస్ట్రీకి చెందిన సముద్రఖని,రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

 

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఇప్పటివరకు తన సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ మరియు మాస్ ఎలివేషన్ సీన్స్ మీదనే దృష్టి పెట్టిన రాజమౌళి, ఈ సినిమా ద్వారా తనలోని కొత్త ఫ్లేవర్ తో అనగా రొమాంటిక్ టచ్ తో ప్రేక్షకులను అలరించడానికి రాజమౌళి సిద్ధమవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే గతంలో రాజమౌళి ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలను రోమాలు నిక్కబొడుచుకునే లా తీసేవాడు. కానీ తాజాగా ఈ సినిమాలో ఎక్కువగా రొమాంటిక్ యాంగిల్ చూపించడానికి రాజమౌళి ఇద్దరు హీరోలకు తమ హీరోయిన్లతో ఎక్కువ రొమాన్స్ సన్నివేశాలు ఉండేటట్లు చూసుకున్న ట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: