సూపర్ స్టార్ మహేష్ స్టామినా గురించి.. ఆయన సినిమాల వసూళ్ల రికార్డుల గురించి అందరికి తెలిసిందే. రాజకుమారుడిగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ కు తెలుగులోనే కాదు నేషనల్ వైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు.

 

జనవరి 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు రెండు నెలల ముందు నుండే ఫ్యాన్స్ హంగామా మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ 81 అడుగుల కటౌట్ ను హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్ సుదర్శన్ 35mm థియేటర్ దగ్గర పెట్టారు. సినిమా ఇంకా రిలీజ్ కు అటు ఇటుగా రెండు నెలలు టైం ఉండగా 50 రోజుల ముందే భారీ కటౌట్ పెట్టి మహేష్ స్టామినా ఏంటో చూపించారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. 

 

సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో రష్మిక కూడా స్టార్ హీరోయిన్ అయ్యిందని చెప్పొచ్చు. సినిమాలో విజయశాంతి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. టీజర్ లో ఆమెతో కూడా ఓ క్రేజీ డైలాగ్ చెప్పించాడు డైరక్టర్ అనీల్ రావిపుడి. ఇక ఈ సినిమా టీజర్ తో అంచనాలు పెంచిన అనీల్ రావిపుడి. 2020 సంక్రాంతికి మహేష్ బాబే బాక్సాఫీస్ మొగుడుగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు.

 

ఓ పక్క అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. మహేష్ వర్సెస్ బన్ని సినిమాల ఫైట్ లో ఎవరు ఈసారి విజేతగా నిలుస్తారో చూడాలి. మొన్నటివరకు జనవరి 12నే రెండు సినిమాల రిలీజ్ డేట్ అని ఎనౌన్స్ చేయగా దర్శక నిర్మాతల మధ్య డీల్ కుదిరి జనవరి 11న మహేష్ సినిమా.. 12న బన్ని సినిమా వస్తుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: