టాలీవుడ్ లో ఓ దశలో అగ్ర దర్శకుడిగా చెలామణి అయ్యాడు శ్రీను వైట్ల. తన సినిమాల్లో కామెడీ, యాక్షన్ ను కలగలిపి చూపించే శ్రీను వైట్లపై హీరోలు నమ్మకంగా ఉండేవారు. కానీ ఎవరికైనా ఫ్లాపులు సహజమే. కానీ శ్రీను వైట్ల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. పెద్ద హీరోలెవరూ ఆయన వైపు చూడటం లేదు.. తన దర్శకత్వంలో నటించేందుకు ధైర్యం చేయట్లేదు. దీంతో శ్రీనునే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇద్దరు హీరోలను తనతో సినిమాలు చేయాలని అప్రోచ్ అయినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 

మంచు హీరో విష్ణును అప్రోచ్ అయ్యాడట శ్రీను వైట్ల. ఓ కథతో వెళ్లి వినిపించినట్టు కూడా సమాచారం. అయితే ప్రస్తుతం మోసగాళ్లు అనే సినిమా చేస్తున్న మంచు వారి అబ్బాయి ఇంకా ఏం రిప్లై ఇవ్వలేదని అంటున్నారు. మంచు మనోజ్ కు సినిమాలే తప్ప హిట్లు లేని సమయంలో ఢీ సినిమాను ఇచ్చాడు శ్రీను వైట్ల. ఆ సినిమా అనేక అవాంతరాలను ఎదుర్కొని విడుదలైతే అనూహ్యమైన హిట్ సాధించి విష్ణు కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ కథతోనే విష్ణును అప్రోచ్ అయ్యాడని కూడా అంటున్నారు. మరి మంచు విష్ణు నుంచి ఏం సమాధానం వస్తుందో చూడాల్సిందే. మరో వైపు గోపీచంద్ తో కూడా సినిమా చేయాలని భావిస్తున్నాడట. గోపీచంద్ తో చర్చలు కూడా జరిగినట్టు సమాచారం.

 

 

మరోవైపు బెల్లంకొండ సాయికి ఓ లైన్ చెప్పినట్టు కూడా వార్తలొచ్చాయి. ప్రస్తుతానికైతే శ్రీను వైట్లకు ఏ హీరో నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదు. కానీ.. శ్రీను ఎక్కువగా మంచు విష్ణుపైనే హోప్ పెట్టుకున్నట్టు వినికిడి. తన మార్కు కామెడీతో ఢీ సినిమాకు సీక్వెల్ తీద్దామనే అలోచనలో ఉన్నాడట. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అయితే శ్రీను మళ్లీ గాడిలో పడినట్టే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: