ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో అద్భుతమైన నటనతో దుమ్ము లేపుతున్నాడు. రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఎండాకాలం లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే ఎన్టీఆర్సినిమా షూట్స్ ని పూర్తి చేసుకున్న వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరొక సినిమా చేయనున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఈ వార్తలన్నింటిలో మరింత ఇంట్రెస్టింగ్గా ఉందేంటంటే... ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి చేసే సినిమా బడ్జెట్.... నిజానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' చిత్ర షూటింగ్ సమయంలోనే.. జూనియర్ ఎన్టీఆర్ కు నెక్స్ట్ సినిమా    కథని వినిపించినట్టు సమాచారం. కానీ ఈ సినిమాని అరవింద సమేత లాగా కాకుండా.. ఏకంగా 200 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్నారని సినీ ఇండస్ట్రీ నుంచి టాక్. ఇంత డబ్బు పెట్టగలిగే నిర్మాతల కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ వెతుకుతున్నట్లు సమాచారం.


అందరూ ఊహించిందేంటంటే...      స్టైలిష్  స్టార్  అల్లు అర్జున్ తో  తెరకెక్కిస్తున్న 'అల... వైకుంఠపురములో' ముగిసిన తర్వాత... త్రివిక్రమ్  శ్రీనివాస్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి లేకపోతే వెంకటేష్ తో కలసి తన నెక్స్ట్ సినిమా తీస్తారని. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో కచ్చితంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన పోతున్నాడని బలంగా వార్తలు వస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ పూర్తయ్యే సమయానికి అల.... వైకుంఠపురములో కూడా పూర్తవుతుందని ఇక ఇద్దరు ఎన్టీఆర్ త్రివిక్రమ్  ఫ్రీ అవుతారని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో  వచ్చే  సినిమా సూపర్ హిట్... బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: