ఎయిటీస్ స్టార్స్ రీయూనియన్ పార్టీ ప్రస్తుతం టాలీవుడ్-టౌన్ లో హాట్ టాపిక్. మెగాస్టార్ కొత్త ఇంటి ప్రవేశం.... ఆ ఇంట్లోనే టాప్ 40 స్టార్స్ పార్టీ అదిరిపోయిందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ శనివారం సాయంత్రం నుంచి మెగాస్టార్ నూతన గృహం తారల సందడితో కళకళలాడిందని లేటెస్ట్ అప్‌డేట్. ప్రతిసారీ చెన్నయ్ సహా పలువురు స్టార్స్ ఇళ్లలో ఎయిటీస్ స్టార్స్ రీయూనియన్ మీట్ జరుగుందన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఈ పార్టీని ఎంతో స్పెషల్ గా హోస్ట్ చేశారు.

 

కొత్త ఇంటి ప్రవేశం వేళా విశేషం.. ఇదే ఇంటిని తారలందరికీ చూపించేందుకు ఈ పార్టీని స్పెషల్ గా ఎరేంజ్ చేశారట మెగాస్టార్. చిరు కొత్త ఇంట్లో సౌత్ ఇండియా ఎయిటీస్ టాప్ స్టార్స్ అంతా గెట్ టు గెదర్ కి అటెండయ్యారు. చిరంజీవి స్వయంగా తారలందరినీ ఆహ్వానించారు. ఆయనే స్వయంగా తన కొలీగ్స్ కి వడ్డించడమే గాక.. పానీయాల్ని సర్వ్ చేసారట. అనంతరం ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుసుకుని తారలంతా ఆనందంలో మునిగి తేలారు. తమిళ- కన్నడ- మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి దాదాపు 40 మంది ఈ పార్టీకి హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ ఈ వేడుకలకు అటెండవటం విశేషం. 

 

చిరంజీవి తో పాటు వెంకీ-నాగార్జున లాంటి స్టార్స్ హాజరయ్యారు. కానీ నటసింహ బాలకృష్ణ ఎందుకనో ఈసారి పార్టీని మిస్సయ్యారు. మెగాస్టార్ పార్టీకి నుంచి రిలీజ్ చేసిన ఆ గ్రూప్ ఫోటోలో బాలయ్య ఎక్కడా కనిపించలేదు. గతంలో ఏర్పాటు చేసి పార్టీల్లో మిస్ అవ్వని బాలయ్య ఈసారి మాత్రం మిస్సయ్యారు. అలాగే ఈ వేడుకలో మరో వెలితి కూడా స్పష్టంగా కనిపించింది. సూపర్ స్టార్ రజనీకాంత్- విశ్వనటుడు కమల్ హాసన్ ప్రతిసారీ ఈ ఈవెంట్ కి తప్పనిసరిగా హాజరయ్యేవారు. కానీ ఈసారి ఆ ఇద్దరూ కూడా మిస్సవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బహుశా ఆ ఇద్దరూ సినిమా షెడ్యూల్స్ తో పాటు రాజకీయాల హడావుడిలో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారని చెప్పుకుంటున్నారు. అలాగే ఈ వేడుకలో హీరో రాజశేఖర్ మిస్సయ్యారని గ్రూప్ ఫోటో చూస్తే అర్థమవుతోంది. అయితే బాలయ్య మాత్రం రాకపోవడానికి కారణం ఆయన నటిస్తున్న 'రూలర్' సినిమా తో బిజిగా ఉండటం వల్లేనని సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: