ఉయ్యాల జంపాల సినిమాతో దర్శకుడిగా తెలుగు పరిశ్రమకి పరిచయం అయిన విరించి వర్మ మొదటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాడు. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాతో ఆయనను బాగా ఇంప్రెస్ చేశాడు. షార్ట్ ఫిల్మ్స్ తో మెప్పించిన విరించి వర్మ ఉయ్యాల జంపాల సినిమా సక్సస్ తర్వాత టాలీవుడ్ లో బిజీ డైరెక్టర్ అవుతాడని అందరు ఊహించారు. కాని ఈ ఆరు సంవత్సరాల్లో విరించి వర్మ చేసింది రెండే రెండు సినిమాలు. వాటిలో ఉయ్యాల జంపాల సక్సెస్ అవగా రెండవ సినిమా మజ్ను యావరేజ్ గా ఆడింది.

 

ఇక మజ్ను సినిమా తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చినప్పటికి తన వద్ద ఉన్న స్క్రిప్ట్ తో సనిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కుర్ర దర్శకుడు హీరోల కోసం వెదికాడు. ముందు ఒక హీరోతో ఒక సినిమాను చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు విరించి వర్మ.  కథ చెప్పడం పూర్తి అయ్యిందట. కాని ఏదో కారణాల వల్ల ఆ హీరో ఆలస్యం చేస్తున్నాడని.. ఇంకో హీరో కోసం విరించి వర్మ ప్రయత్నాలు సాగిస్తున్నాడంటూ తాజా సమాచారం. దాదాపు రెండు సంవత్సరాలుగా విరించి వర్మహీరో కోసం వెయిట్ చేసి ఇప్పుడు మరో హీరోతో సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చాడట.

 

మెగా హీరో వరుణ్ తేజ్ తో కూడా విరించి వర్మ చర్చలు జరుపుతున్నాడని.. కాని ఇంకా అవి ఒక కొలిక్కి రాలేదని లేటెస్ట్ అప్‌డేట్. వరుణ్ తేజ్ తో సినిమా వర్కౌట్ కాకపోతే కనీసం రాజ్ తరుణ్ తో అయినా సినిమా చేయాలని చూస్తున్నాడట. మొత్తానికి 2020 లో ఏదో ఒక సినిమాను మొదలు పెట్టాలని విరించి వర్మ ప్రయత్నాలు చేస్తున్నాడట. మొదటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విరించి వర్మకు బ్యాడ్ టైం కారణంగానే సినిమాలు ఆలస్యం అవుతున్నాయంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. దీన్నే ఖర్మ కాలితే చేతిలో ఉన్నవన్ని జారి కిందపడిపోతాయనడం...అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: