యూపీలో ఉన్న ఒక కోర్టు ఇచ్చిన తీర్పు బాలీవుడ్ లో ఇప్పుడు సంచలనంగా మారింది. బాలీవుడ్ ప్రముఖులకు షాకింగ్ గా మారిన ఈ తీర్పును బ్రాండ్లను ప్రమోట్ చేసే సెలబ్రిటీలు.. నటులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు వస్తున్నాయి కదా అని ఏ బ్రాండ్లకు పడితే ఆ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించటంతో పాటు.. వారిచ్చిన స్క్రిప్టును పొల్లు పోకుండా చెప్తే కఠిన చర్యలు తప్పవని తాజా తీర్పు ను చూస్తే అర్థమవుతాయి. ఇటువంటిదే రీసెంట్ గా టాలీవుడ్ లోను జరిగింది. యూపీలోని ముజఫర్ నగర్ లోని వినియోగదారుల కోర్టు ఇచ్చిన తీర్పు సెలబ్రిటీల కు కళ్లు తెరిచేలా ఉంటుందనటంలో సందేహం లేదు. బాలీవుడ్ సీనియర్ నటులైన గోవిందా.. జాకీష్రాప్ లకు జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఒక పెయిన్ రిలీఫ్ ఆయిల్ యాడ్ లో నటించినందుకు కోర్టు వీళ్ళకి జరిమానా విధించింది. 

 

2012 జులైలో అభినవ్ అగర్వాల్ అనే లాయర్ తన తండ్రి కోసం ఒక పెయిన్ రిలీఫ్ ఆయిల్ కొన్నారట. దీన్ని కొనుగోలు చేయటానికి కారణం.. ఆ ప్రొడక్ట్ ను బాలీవుడ్ ప్రముఖ నటులు గోవిందా.. జాకీష్రాఫ్ నటించటం.. ఆయిల్ వాడితే పదిహేను రోజుల్లో ఎలాంటి నొప్పి అయినా తగ్గి పోతుందని చెప్పటంతో నమ్మేశాడు. ఆ వెంటనే రూ.3600 ఖర్చు పెట్టి మరీ ఆ ఆయిల్ ను కొన్నరట. అయితే.. ఆ ఆయిల్ ను వాడటం మొదలుపెట్టిన పది రోజులకు కూడా ఎలాంటి ఫలితం లేకపోవటంతో ఆ లాయర్ హర్ట్ అవడంతో ప్రకటనలో చెప్పిన్నట్లుగా ఎలాంటి పలితం రాక పోవటంపై మనోవేధనకు గురయ్యాడు. తన తండ్రి కోసం కొన్న ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఎలాంటి ప్రయోజనం లేక పోవటంతో కంపెనీ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు కూడా. ఆ బాటిల్ ను వెనక్కి తీసుకొని డబ్బులు ఇస్తానని చెప్పారట. కానీ వాళ్ళు చెప్పినట్లు చేయలేదు.

 

దీంతో కట్టలు తెచ్చుకున్న కోపంతో ఆ లాయర్ వినియోగదారుల కోర్టు ను ఆశ్రయించారు. ప్రముఖ నటులు బ్రాండ్ ను ప్రమోట్ చేయటంతోనే తాను ఆయిల్ కొన్నట్లుగా పేర్కొన్న వాదనతో ఏకీభవించిన కోర్టు.. గోవిందా.. జాకీష్రాఫ్ లకు రూ.20వేలు ఫైన్ వేస్తూ తీర్పునిచ్చింది. అంతేకాదు ఆయిల్ బాటిల్ కోసం చెల్లించిన మొత్తాన్ని.. వడ్డీ తో కలిపి వినియోగదారుడి కి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఖర్చులు.. లాయర్ ఖర్చులు కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. దీన్ని బట్టి సినిమా సెలబ్ర్టీస్ ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇకపై ఒక ప్రొడక్ట్ ను ప్రమోట్ చేసేటప్పుడు అన్ని చూసుకొని అంగీకరించాలన్న విషయం.  

మరింత సమాచారం తెలుసుకోండి: