రీసెంట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీజర్ మిలియన్స్ వ్యూస్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచేస్తుంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అన్న టాక్ కూడా బాగానే వినిపిస్తోంది. కానీ ఈ టీజర్ చూసాక కొంతమంది ప్రేక్షకులకు కలిగిన సందేహం కూడా ఒకటుంది. అదే సూపర్ స్టార్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయో సినిమా ఒక్కడు. వాస్తవంగా చెప్పాలంటే సరిలేరు టీజర్ చూస్తూ అందరూ మహేష్ 'ఒక్కడు' ను గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాని, ఈ సినిమాని కంపేర్ చేస్తూ కామెంట్స్ కూడా విసురుతున్నారు.

 

టీజర్ లో చూపించిన మహేష్ యాక్షన్ ఎపిసోడ్, కొండారెడ్డి బురుజు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఇలా అన్ని ఎలెమెంట్స్ 'ఒక్కడు'లో ఉన్న పోలికలు కనిపిస్తున్నాయి. నిజానికి మహేష్ కెరీర్ లో ఒక్కడు ఓ క్లాసిక్. పోకిరి కంటే ముందే మహేష్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ దగ్గర తెలియజేసిన సినిమా. ఆ సినిమాను గుణశేఖర్ బాగా హ్యాండిల్ చేసి సంక్రాంతికి ఓ అదిరిపోయే సినిమా అందించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసేసింది.

 

ఇక సరిలేరు నీకెవ్వరులో మహేష్ ఆర్మీ మెన్ గా నటిస్తున్నాడు. ఆ ఒక్క ఎలిమెంట్ తప్ప టీజర్ అంతా ఒక్కడు తరహాలోనే ఉన్నట్టు అనిపిస్తోందని జనాలు చెప్పుకుంటున్నారు. మరి ట్రైలర్ లో అయినా కాస్త కొత్తదనం ఉంటుందేమోనని మహేష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా 2020 సంక్రాంతికి రాబోతోంది. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాతో గట్టి పోటీగా దిగుతోంది. మరి ఈ రెండు సినిమాలలో ఏది బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండగా..కన్నడ బ్యూటి రష్మిక మందన్న మహేష్ కి జంటగా నటిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: