‘ఏ మాయ చేసావే’ సినిమాతో అక్కినేని నాగ చైతన్య నీ మాయ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత అక్కినేని ఇంటి వారి కోడలు అయిపోయింది. అయితే పెళ్లయ్యాక కూడా సినిమాలు చేస్తున్నా సమంతా తన భర్తతో కలిసి పెళ్లయిన తర్వాత మజిలీ సినిమాలో నటించి భయంకరమైన ఫ్లాపుల్లో ఉన్న నాగచైతన్య కి సూపర్ డూపర్ హిట్టు పడేలా చేసింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్యలవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చైతు పక్కన యాక్ట్ చేస్తుంది.

 

ఇదే క్రమంలో ఇటీవల లేడీ ఓరియంటెడ్ సినిమా టైపు 'ఓ బేబీ' సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్ అందుకొని అక్కినేని అభిమానులను ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించిన సమంత తాజాగా నాగచైతన్య అభిమాని చేసిన పనికి ఫిదా అయిపోయింది. విషయంలోకి వెళితే అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా అభిమానులు ఉన్నారు. ఏఎన్నార్, నాగార్జున ఆ తర్వాత వారి వారసత్వాని నాగ చైతన్య, అఖిల్ కొనసాగిస్తున్నారు. ఇటీవల నాగచైతన్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు.

 

నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా సాగర్ అనే వీరాభిమాని సింహాచలం ఆలయంలో వెయ్యి మెట్లని మోకాళ్లపై ఎక్కాడు. నాగ చైతన్య సంతోషంగా ఉండాలని తాను మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. అతడి అభిమానానికి ఆశ్చర్యపోయిన సమంత స్పందించింది.  అంతేకాకుండా సాగర్ కి ధన్యవాదాలు కూడా తెలిపింది. ఇటువంటి అభిమానం ఎక్కడా చూడలేదు అన్నట్టుగా అతను చేసిన పనికి మాటలు రావడం లేదని….కుదిరితే సాగర్ తమని కలవాలని సమంతా కోరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: