‘సాహో’ షాక్ నుండి తేరుకుని ప్రభాస్ తన లేటెస్ట్ మూవీ ‘జాన్’ పై దృష్టి పెట్టి తన షూటింగ్ ను తిరిగి కొనసాగించాలని ప్రభాస్ చేస్తున్న ప్రయత్నాలకు పరిస్థితులు సహకరించడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీ కథ రీత్యా యూరప్ లో తీయవలసిన పరిస్థితులు ఉన్నా ఈ మూవీ బడ్జెట్ పై తనకు తానే కోతలు విధించుకుని ఈ మూవీకి సంబంధించిన సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో యూరప్ వాతావరణం ప్రతిబింబించేలా ఒక భారీ సెట్ ను ప్రభాస్ సలహాతో వేసారు.

దీనికితోడు సహజత్వం కోసం యూరప్ నుండి కొంతమంది సహాయనటులను తీసుకు వచ్చి సీన్స్ చిత్రీకరణ విషయంలో పూర్తిగా యూరప్ వాతావరణం కనిపించేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ షూటింగ్ ను ఆపివేయమని ప్రభాస్ కోరినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

అంతేకాదు జిల్ రాథా కృష్ణమూవీ కోసం తయారు చేసిన ఫైనల్ స్క్రిప్ట్ లో తనకు కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని చెప్పడమే కాకుండా ఆ లోపాలను సరిచేయమని ఈ మూవీ స్టోరీ టీమ్ కు ప్రభాస్ చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి గతంలో జరిగిన యూరప్ షెడ్యూల్ కు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ కు ఈ మూవీని నిర్మిస్తున్న కృష్ణంరాజు పది కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

మూవీ షూటింగ్ ను ప్రభాస్ తాత్కాలికంగా ఆపివేయమన్నాడు అని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ఈ మూవీని ప్రభాస్ శాస్వితంగా అటక ఎక్కిస్తాడా లేదంటే మళ్ళీ కొంత గ్యాప్ ను తీసుకుని ఈ మూవీని కొనసాగిస్తాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో ప్రభాస్ ‘సాహో’ షాక్ నుండి బయటపదాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా పూర్తిగా బయటకు రాలేకపోతున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: