మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'అలా వైకుంఠపురం లో' సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. రాబోయే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ కెరీర్లో అదరగొట్టే రీతిలో అభిమానులను ప్రేక్షకులను సినిమాలు అలరించడం తో అలా వైకుంఠపురం లో సినిమాతో కచ్చితంగా బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ ఈ సంక్రాంతికి పడుతుందని అంటున్నారు అభిమానులు.

 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన మూడు పాటలు సోషల్ మీడియాలో మరియు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్న నేపథ్యంలో యూట్యూబ్ లో అనేక రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొట్టే రీతిలో జరిగినట్లు ముఖ్యంగా ఓవర్సీస్ లో సినిమా అదిరిపోయే రేటు పలికినట్లు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ సినిమా తో పాటు రిలీజ్ కాబోతున్న మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా టీజర్ ఇటీవల విడుదల కావడంతో టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడం తో...అలావైకుంఠ పురం లో సినిమా టీజర్ గురించి సరైన రెస్పాన్స్ మరియు స్పందన రాకపోవడంతో అభిమానులలో గందరగోళం నెలకొనడంతో తాజాగా ఇండస్ట్రీ నుండి ఒక లేటెస్ట్ న్యూస్ గట్టిగా వినబడుతుంది.

 

అదేమిటంటే సినిమాకి సంబంధించిన టీజర్ వచ్చే డిసెంబర్ మొదటి వారంలో గానీ లేక పోతే రెండో వారంలో గానీ విడుదల చేయాలనే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. అంతేకాకుండా సీనియర్ హీరోయిన్ టబు మరియు అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుశాంత్ కూడా సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: