ఎనర్జిటిక్ స్టార్  రామ్ హీరోగా పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన  సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయ ఢంకా మోగించింది. అప్పటి వరకు పూరి పని అయిపోయిందన్న వారందరూ ఈ సినిమా విజయం చూసి ముక్కున వేలేసుకున్నారు. టెంపర్ తర్వాత పూరికి అంతటి స్థాయి విజయాన్నీ తీసుకొచ్చింది ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాలో రామ్ నటనకి, డైలాగులకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

 

ముఖ్యంగా ఈ సినిమాలో అందర్నీ ఆకర్షించిన అంశం మరోటి ఉంది. అదే హీరోయిన్లు. ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమాని మరో రేంజ్ కి తీసుకుపోయారు. తమ గ్లామర్ తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. నభా నటేష్, నిహి అగర్వాల్... వీరిద్దరికీ ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు అందుతున్నాయి. అప్పటి వరకు వారి కెరీర్ కాస్త స్లో ఉంటే, ఇస్మార్ట్ శంకర్ తర్వాత జెట్ స్పీడును అందుకుంది.

 


నిధి అగర్వాల్ అజయ్ గల్లా హీరోగా లాంచ్ అవుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళంలో భూమి అనే చిత్రంలోనూ నటిస్తుంది. ఇక నభా నటేష్ అవి తేజ సరసన డిస్కో రాజా లో నటిస్తుందని తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరిద్దరికీ మరీ బంపర్ ఆఫర్ వచ్చింది. మెగా హీరో సరసన నటించే అవకాశం వచ్చింది. వరుణ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ సాగుతున్న సంగతి తెలిసిందే. 

 

ఇందులో వరుణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు అవసరమట. ఆ ఇద్దరుఇస్మార్ట్ భామలు అయితే పర్ పెక్ట్ గా సరిపోతారని వరుణ్-కొర్రపాటి బృందం భావిస్తున్నారట. ఇప్పటికే సదరు భామలకు కాల్ వచ్చిందని తెలుస్తోంది. అంతేకాదు .. వెంటనే కాల్షీట్ల ను కూడా లాక్ చేసారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: