బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అందుకే తన సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే చేయాలని అనుకుంటున్నాడు. మొన్న వచ్చిన సాహో దక్షిణాది ప్రేక్షకులని నిరాశపరిచినా, ఉత్తరాది వారిని బాగానే ఆకట్టుకుంది. దాంతో బాలీవుడ్ లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభాస్ బాలీవుడ్ లో సినిమా చేయాలి అని అంటున్నారు.

 

అయితే గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నిర్మాతలు ప్రభాస్ తో సినిమా కోసం సంప్రదిస్తున్నారట. ప్రసుతానికి ప్రభాస్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమా చేస్తున్నాడు. మూడు భాషల్లో తెరకెక్కుతున ఈ చిత్రం యూరప్ లో చిత్రీకరణ జరుపుకుంటోందిట. అయితే ఈ సినిమా అనంతరం ప్రభాస్ సురేందర్ రెడ్డి తో సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి. సైరా సినిమా ద్వారా సురేందర్ రెడ్డి తానేంటో నిరూపించుకున్నాడు.

 

సురేందర్ రెడ్డి ప్రభాస్ తో సినిమా చేయడానికి స్క్రిప్టు రెడీ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అది ఎంతవరకు నిజమనేది తెలియదు. ప్రస్తుతం ప్రభాస్ తదుపరి గురించిన మరో అంశం బయటకి వచ్చింది.  బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ తో ప్రభాస్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు కరణ్ జోహార్, ప్రభాస్ ల మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం.

 

త్వరలోనే ప్రభాస్ కరణ్ జోహార్ ని కలుస్తాడట. ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఆ సినిమా బాహుబలి రేంజ్ లో ఉండాలని అనుకుంటున్నారు. మరి కరణ్ జోహార్ తో సినిమా ఉంటుందా..లేదా వేరే నిర్మాత ద్వారా బాలీవుడ్ లో సినిమా చేస్తాడా అనేది తెలియాలి.  జాన్ సినిమా 2020 చివరి భాగంలో విడుదల అవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: