సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలన్ని ఓ పెద్ద సంచలనమే. అంతేకాదండోయ్ ఈ దర్శకుడు సంచలనం సృష్టించకుండా ఏ పని చేయడు. అందుకే రాంగోపాల్ వర్మ ట్వీట్ చేసిన సంచలనంగానే మారుతుంది... ఓ మాట మాట్లాడినా అది పెద్ద సెన్సేషన్ అవుతుంది ఇక సినిమాల విషయానికొస్తే అంతకుమించి అనేంతలా ఉంటుంది. కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాంగోపాల్ వర్మ... ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో తెరమీదికి వస్తూనే ఉంటాడు. వర్మ చుట్టూ వివాదాలు ఉన్నాయో...వివాదాల చుట్టు వర్మ ఉన్నాడో అన్నది మాత్రం ప్రేక్షకులకు అర్ధం కాని విషయం. అంతేకాకుండా రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారు అన్నది కూడా ఊహకందని అంశం. ఇక వర్మ ఎవరినైనా టార్గెట్ చేశాడు అంటే చిత్రవిచిత్రమైన పోస్టులతో ఎన్నో విమర్శలు చేస్తాడు.
అయితే వర్మ ట్వీట్ లో కాదు సినిమాల్లో కూడా వివాదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఏ సినిమాలో అయినా ఓ వివాదాన్ని తెరమీదకు తెచ్చి సినిమాని తెరకెక్కిస్తుంటాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇక తన సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ చేసుకోకుండానే తన వివాదాస్పద ట్విట్ లతోనే జబర్దస్త్ గా ప్రమోషన్స్ చేసుకుంటాడు. అయితే ఒకప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ తో సంచలనం సృష్టించిన వర్మ... ఇప్పుడు తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను తెరపైకి తెచ్చాడు. 2019 ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తన సినిమాను తెరకెక్కించినట్లు ఇప్పటికీ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ వివాదాస్పద సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే తన పాత్రను బ్యాడ్ గా చూపించారంటు కేఏ పాల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా ఇప్పుడు ఇంద్రసేన చౌదరి అనే వ్యక్తి కూడా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదలను ఆపేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం కమ్మ-రెడ్డి వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని అందుకే ఈ సినిమా విడుదలను చేయాలని కోరారు. అయితే ఈయన హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్పై ఈనెల 27న హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ఈ సినిమాపై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇదంతా చూస్తుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పై ఎఫెక్ట్ పడినట్లే ఈ సినిమాపై కూడా ఎఫెక్ట్ పడుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.