శ్రీ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. సోషల్ మీడియా లో పచ్చిపచ్చిగా పోస్టులు పెడుతోంది. అవి అలాంటి ఇలాంటి పోస్టులు కాదు ఈ పోస్టులు చూస్తే అసలు ఆడవాళ్లు మాట్లాడాల్సిన మాటలేనా అనిపిస్తుంది. తాజా గా తన ఫేసుబుక్ అకౌంట్ వేదికగా మరోసారి రెచ్చిపోయింది ఈ వివాదాస్పద నటి. 

 

శ్రీ రెడ్డి తన ఫేస్‌బుక్‌లోకి, “సమాజానికి మంచి పనులు చేయడానికి నాకు క్రింద అవి లేవు, సమాజానికి చెడు చేస్తున్న వారి క్రిందవి కత్తిరిస్తా ” అంటూ ఈ రోజు ఉదయం శ్రీ రెడ్డి పోస్ట్ చేసింది. ఫేసుబుక్ లో ఆమె ఫోటోను పోస్ట్ చేసి, “ నేను పిల్లిలాగా ట్విట్టర్ ద్వారా మాట్లాడను, త్వరలో నేరుగా సమాజంలోకి వస్తాను, మార్పు జరగాల్సిన చోటా పోరాడుతాను" అని పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. ఇక గత రెండు రోజుల క్రితం యూట్యూబ్ లో తన మీద ఎవరైనా అసహ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి. తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి. 

 

ఇక శ్రీ రెడ్డి వార్నింగ్ ను చూసి నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఏ మంచి పనులు చేసారు ?,  మీ పేరు మీద ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఉందా ?, మీరు ఏవైనా విరాళాలు చేశారా ?, మీరు అనాధ పిల్లలను చూసుకున్నారా ?,  మీరు పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారా? అంటూ శ్రీ రెడ్డి ని అడిగిన ప్రశ్న అడగకుండా నెటిజన్స్ ఫేసుబుక్ లో కామెంట్లు పెడుతున్నారు. "ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన హీరోయిన్లు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని పెద్దలను సంతృప్తి పరచడానికి ఎంత దూరమైన వెళ్తారు, అయితే స్థానిక అమ్మాయిలు ఆ పనులు చెయ్యలేరు అందుకే మాకు సినీ పరిశ్రమలో అవకాశాలు రావట్లేదు" అని శ్రీ రెడ్డి అన్నారు. శ్రీ రెడ్డి తనను టాలీవుడ్ మరియు తమిళ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని వాడుకుని మోసం చేసారని గతంలో ప్రకటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: