సినీ ప్రపంచంలో ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయో మన అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో కూడా ప్రేమ వ్యవహారాలు ఉంటాయి కానీ అవి ఎవరికీ తెలియకుండా జరుగుతూ ఉంటాయి అంటారు. అయితే బాలీవుడ్ లో అలా కాదు అక్కడ అంత ఓపెన్ గా చేసేస్తారు. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ 'సంజు' లో తన జీవితంలో ఉన్న అమ్మాయిల సంఖ్య చెప్పి అందరినీ షాక్ కు గురి చేస్తాడు. నిజానికి గిన్నిస్ బుక్ వారు ఇలాంటి వాటికీ రికార్డులు ఇవ్వరు కానీ ఇస్తే మాత్రం సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ లాంటి ఘటికులు ఎప్పుడో ఘనమైన రికార్డులు సృష్టించేవారు. ఈ మధ్య ఇలాంటి టాపిక్ పైనే అందాల భామ దీపిక పదుకొనె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 

ఏ మధ్యనే దీపిక పదుకొనె, రణ్ వీర్ సింగ్, విజయ్ దేవరకొండ, అలియా భట్,ఆయుష్మాన్ ఖురానా, మనోజ్ బాజ్ పాయ్ లు ఫిలిం క్రిటిక్ అనుపమ చోప్రా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటీనటుల ప్రేమ వ్యవహారాలపై దీపిక మాట్లాడుతూ తమకు సిగ్గు లేదని మాట్లాడి సంచలనం సృష్టించింది. "నేను.. రణబీర్ కపూర్ ప్రేమించుకున్నాం.. అయితే రణవీర్ సింగ్ ను వివాహం చేసుకున్నాను. ఇప్పుడు రణబీర్- అలియా పెళ్ళి చేసుకుంటున్నారు" అని ఓపెన్ గా చెప్పేసింది.

 

ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో తన భర్త రణవీర్ సింగ్ అక్కడే ఉన్నాడు. అయితే రణబీర్ - అలియా పెళ్ళిపై స్పందిస్తూ అలియా మా పెళ్ళి విషయం నువ్వు ఎలా ధృవీకరిస్తావు?" అంటూ ఎదురు ప్రశ్నించింది.

 

ఇవన్నీ పక్కన  పెడితే మాజీ ప్రియుడు.. ప్రస్తుత ప్రియుడు.. భర్త.. మాజీ భర్త ఇలా అందరూ పక్క పక్కనే కూర్చుని పకోడీలు తింటూ ప్రేమాయణాల గురించి జోకులు వేసుకుంటూ ఉండడం ప్రపంచం లో ఎక్కడా చూడలేం.. అంతేనా దీపికా ,రణబీర్ కపూర్ విడిపోయిన తర్వాత కూడా సినిమాలో లిప్ కిస్ లు కూడా పెట్టుకున్నారు. ఈ విషయంపై అప్పటి  రణబీర్ కపూర్ లవర్ కత్రినా కైఫ్ తో గొడవ కూడా అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: