స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.

 

ఈ సినిమాను 2020 జనవరి 12న రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఇప్పటికే రిలీజైన మూడు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా త్రివిక్రం ఈ సినిమా కథను ఓ తెలుగు క్లాసిక్ మూవీ నుండి తీసుకున్నాడని అంటున్నారు. ఫిల్మ్ నగర్ లో వస్తున్న వార్తల ప్రకారం అల వైకుంఠపురములో సినిమా ఇంటిగుట్టు సినిమాకు కాపీ అంటున్నారు.

 

1958లో ఎన్.టి.ఆర్, సావిత్రి నటించిన ఇంటిగుట్టు సినిమాను వేదాంతం రాఘవయ్య డైరెక్ట్ చేశారు. వేర్వేరు తల్లులకు జన్మించిన ఇద్దరు మగ బిడ్డలు అటు ఇటు తారుమారైతే ఎలా ఉంటుందో నేటితరానికి రిలేట్ అయ్యేలా కథను తీర్చిదిద్దాడట త్రివిక్రం. త్రివిక్రం తన ప్రతి సినిమా విషయంలో ఇలాంటి ఓ న్యూస్ బయటకు రావడం కామనే.

 

లేటెస్ట్ గా ఇంటిగుట్టు సినిమానే త్రివిక్రం మరచి అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది చూడాలి. ఈ సినిమాలో పూజా హెగ్దె ఉన్నా సరే కాజల్ తో ఓ క్రేజీ ఐటం సాంగ్ ప్లాన్ చేశారట. థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించగా మరోసారి ఈ పక్కా లోకల్ పాప రెచ్చిపోవడం ఖాయమని తెలుస్తుంది. నా పేరు సూర్య తర్వాత బన్ని నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: