తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం యూత్ లో ఎక్కువ  క్రేజ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్ళి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన ఈ నటుడు ఆ తర్వాత వచ్చిన "అర్జున్ రెడ్డి" సినిమాతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా విజయం అతన్ని రాత్రికి రాత్రే స్టార్ ని చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన "గోత గోవిందం" కూడా విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

 

దాంతో విజయ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి నుండీ విజయ్ సినిమాల మీద ప్రేక్షకులకి అంచనాలు కూడా పెరిగిపోయాయి. అందువల్ల విజయ్ కి లాభం ఎంత చేకూరిందో నష్టం కూడా అంతే వచ్చింది. ఆ నష్టం డియర్ కామ్రేడ్ రూపంలో బయటపడింది. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుని విజయ్ స్పీడుకి బ్రేక్ వేసింది. అయితే అప్పటి నుండి విజయ్ కొంత కూల్ అయ్యాడనే వార్తలు వచ్చాయి.

 

మొన్నటికి మొన్న నిర్మాతగా మారి మీకు మాత్రమే చెప్తా అని సినిమా చేసినప్పటికీ, ఆ ప్రయత్నం పూర్తిగా సఫలీకృతం కాలేదు.  విజయ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడినప్పటికీ కథలో దమ్ము లేకపోవడంలో తేలిపోయింది. అయితే ఇవేవీ విజయ్ క్రేజ్ కి అడ్డు రాలేదు. ప్రస్తుతం విజయ్ రెండు సినిమాలు చేస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో "వరల్డ్ ఫేమస్ లవర్" అని చిత్రంలో నటిస్తున్నాడు.

 

అయితే గత కొన్ని రోజులుగా విజయ్ క్రేజ్ పడిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో విజయ్ క్రేజ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.తాజాగా ఒక టీవీ షోలో దీపికా పదుకునే రణ్ వీర్ సింగ్ అలియా భట్ వంటి వాళ్లతో పాటు ఆయుష్మాన్ ఖురానా మనోజ్ బాజ్ పాయ్ వంటి స్టార్లతో  విజయ్ దేవరకొండ కూడా ఆ షోలో పాల్గొన్నాడు. మిగతా హీరోలకెవ్వరికీ రాని ఈ అవకాశం విజయ్ కే దక్కింది. ఈ ఒక్క విషయంతో విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: