ఓవర్ నైట్ లో ఇస్మార్ట్ టీమ్ జాతకమే మారిపోయింది. అందుకు కారణం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగనాధ్. ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ టాక్ తో ఆ టీమ్ మెంబర్స్ అందరికీ వరుస అవకాశాలు వచ్చి ఒళ్ళో పడుతున్నాయి. ఇక గ్లామర్ హీరోయిన్స్ నభా నటేష్-నిధి అగర్వాల్ కెరీర్ కి తిరుగులేదని తాజా సమాచారం. అప్పటి వరకూ స్లోఫేస్ లో ఉన్న కెరీర్ ఒక్కసారిగా జెట్ స్పీడ్ లో వెళుతోంది. ఈ క్రెడిట్ మొత్తం పూరి జగన్నాథ్ కే చెందుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన మార్క్ మాసిజం ఆ ఇద్దరు బ్యూటీస్ కి అంత పెద్ద లైఫిచ్చింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి- నభా ల గ్లామర్, తెరపై ఒదిగిపోయిన తీరుని కుర్రాళ్లు అంత తేలిగ్గా మర్చిపోలేరు.

 

సరిగ్గా ఇదే పాయింట్ చాలా మంది దర్శక, నిర్మాతలనే కాదు హీరోస్ ని అట్రాక్ట్ అయ్యోలా చేసింది. అందుకే ఇప్పుడు ఆ ఇద్దరు హాట్ బ్యూటీస్ కి అవకాశాలిచ్చేందుకు పోటా పోటీగా దర్శక, నిర్మాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ అశోక్ గల్లా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి రెమ్యూనరేషన్ కూడా భారీగా ఆఫర్ చేశారు. దీంతో పాటు కోలీవుడ్ లో భూమి అనే భారీ సినిమాలో నటిస్తోంది. ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్ లు క్యూ లో ఉన్నాయి. ఇక నభా నటేష్ రవితేజ సరసన డిస్కో రాజా సినిమాలో నటిస్తోంది. కొన్ని కథలు విని హోల్డ్ లో ఉంచుకుందట.

 

ఈ నేపథ్యం లో తాజాగా ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటిస్ కి మెగా హీరో వరుణ్ తేజ్ నుంచి పిలుపు వచ్చిందని లేటెస్ట్ న్యూస్. వరుణ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ సరసన నటించడానికి ఇద్దరు హీరోయిన్లు కావాలట. ఆ ఇద్దరు ఇస్మార్ట్ బ్యూటీస్ అయితే పర్ పెక్ట్ గా సరిపోతారని వరుణ్-కొర్రపాటి బృందం భావిస్తున్నారట. ఇప్పటికే ఈ ఇద్దరికి కాల్ వచ్చిందని తెలుస్తోంది. అంతేకాదు .. వెంటనే కాల్షీట్ల ను కూడా లాక్ చేసారని ఫిలిం నగర్ నుండి అందిన సమాచారం. ముందు ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ ని తీసుకోవాలనుకున్నారు. కానీ తన డేట్లు సర్దుబాటు కాకపోవడంతో నో చెప్పిందని వార్తలు వచ్చాయి. కియరా ఒకేసారి నాలుగైదు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తన స్థానంలో అంతకుమించి హాట్ గాళ్స్ ని ఎంపిక చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇక రెమ్యూనరేషన్ పరంగా కూడా ఇస్మార్ట్ హీరోయిన్స్ కంటే కియారాకే ఎక్కువ కావడం కూడా ఒక కారణం. 

మరింత సమాచారం తెలుసుకోండి: