బయోపిక్ తీయడం అనేది ఎప్పుడు కత్తి మీద సాము లాంటిది. ఉన్నది ఉన్నటు తిస్తె కొందరికి కోపం వస్తుంది. వాస్తవానికి దూరంగా తిస్తె విమర్శకుల దాడి పెరుగుతుంది. లేని వాటిని జోడిస్తే అన్ని వైపులా నుండి వ్యతిరేకత వస్తుంది. బయోపిక్ తీసే వ్యక్తి వివాదాస్పదమైతే ఇంకా ఎక్కడ లేని చిక్కు ముడులు ఉంటాయి. అటువంటి  ఒక బయోపిక్ టాలీవుడ్ లో రాబోతుంది.

 

 

టాలీవుడ్ లో గొప్ప నటులైన అలనాటి మహానటి సావిత్రి, నందమూరి రామ రావు జీవిత కథల ఆధారంగా సినిమాలు ఇప్పటికే తెరకెక్కాయి. వీటిలో సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటి కి విమర్శకుల ఆప్యాత లభించగా, ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఫై వచ్చిన చిత్రాలు మహానాయకుడు, కథానాయకుడు ఘోర పరాభవాన్ని చవి చూశాయి. తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ ఫై ఓ బయోపిక్ రాబోతుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

 

 

ఉదయ్ కిరణ్ ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగు ఇండస్ట్రీ కి వచ్చిన హీరో. వరుస ఘన విజయాలతో అప్పట్లో టాలీవూడ్ ను  ఒక ఊపు ఊపాడు. 'చిత్రం' సినిమా తో తన కెరీర్ స్టార్ట్ చేసిన ఉదయ్ ఆ తర్వాత 'నువ్వు  నేను', 'మనసంతా నువ్వే' సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు. ఉదయ్ కిరణ్ ఎలాంటి  బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఇండస్ట్రీ కి వచ్చి సరికొత్త రికార్డులకు తెర తీసాడు.

 

 

నీ స్నేహం, శ్రీ రామ్ లాంటి సినిమాలు ఉదయ్ కిరణ్ ను స్టార్ హీరోగా నిలబెట్టాయి. మెల్లి మెల్లిగా ఛాన్సులు తగ్గి పోవడం, మునుపటిలా విజయాలు రాక రావడం తో ఉదయ్ కెరీర్ డౌన్ అయిపొయింది. ఔనన్నా కాదన్నా చిత్రాన్ని తనకు జీవితం ఇచ్చిన దర్శకుడు తేజ తో తీసిన అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. వరుస చిత్ర పరాభవాలు, వ్యక్తిగత కారణాలతో కుంగిపోయిన ఉదయ్ కిరణ్ ఆత్మ హత్య చేసుకున్నాడు. గతంలో  ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తానని తేజ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. కాబోయే అల్లుడు అంటూ ఒక బయోపిక్ తీస్తా అని చెప్పి ఆపేశాడు.ఇప్పుడు తాజాగ సోషల్ మీడియాలో సందీప్ కిషన్ హీరోగా  ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తున్నారు అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమా కాదా అనేది  కాలమే నిర్ణ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: