ప్రస్తుతం కోలీవుడ్ లో ఎక్కడ చూసినా, ఎవరు మట్లాడినా అమ్మ జయలలిత బయోపిక్ గురించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జయలలిత జీవితంపై బయోపిక్ లు తెరకెక్కుతున్నాయన్న విషయం తెలిసిందే. తమిళంలో రెండు సినిమాలు ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ మూడింటిలో కూడా ఎక్కువ శాతం మంది విజయ్ దర్శకత్వంలో కంగనా నటిస్తున్న 'తలైవి' సినిమా మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇక మరో సినిమాలో నిత్యామీనన్ అమ్మగా నటిస్తుంది. ఆ సినిమాకు 'ది ఐరెన్ లేడీ' అనే టైటిల్ ను ఎప్పుడో కన్‌ఫర్మ్ చేశారు. ఇక వెబ్ సిరీస్ లో శివగామి రమ్యకృష్ణ అమ్మగా నటిస్తోంది.

 

ఇక రీసెంట్‌గా తలైవి సినిమా నుండి ఫస్ట్ లుక్ వచ్చింది. ఈ ఫస్ట్ లుక్ మీద సోషల్ మీడియాలో తీవ్రంగ విమర్శలు వస్తున్నాయి. మేకప్ సరిగా సూట్ అవ్వక పోవడంతో పాటు కంగనా హావభావాలు కూడా అసలు బాగా లేవంటు కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో 'ది ఐరెన్ లేడీ' సినిమాలో జయలలిత పాత్ర పోషిస్తున్న నిత్యా మీనన్ స్పందిస్తూ అమ్మ పాత్రకు నేను మాత్రమే పర్ ఫెక్ట్ సూట్ అవుతాను. ఆ పాత్ర కోసం నాకు నేను చాలా మార్పులు చేసుకుంటున్నాంటూ వెల్లడించింది. ఇప్పుడు నిత్యా ఇలా మాట్లాడటం అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

 

జయలలిత గురించి నాకు చిన్నప్పటి నుండి చాలా ఆసక్తి. ఆమె గురించి ఇప్పుడు ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. అమ్మ లాగే నేను ఏదైనా మొహంపైనే చెప్పేస్తాను. ఆమెలా ఉండేందుకు వంద శాతం ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమాను చేస్తానంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నాకు తప్ప ఆ పాత్ర ఇంకెవరికి సెట్ అవ్వదన్నట్లుగా నిత్యామీనన్ కామెంట్స్ చేసింది. అయితే నిత్యా చేసిన ఈ కామెంట్స్ ఇండైరెక్ట్ గా కంగనాను ఉద్దేశించి అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అంతేకాదు ఈ విషయంలో కోలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఒకవైపు కంగనా..మరో వైపు నిత్యామీనన్ లను కంపేర్ చేస్తూ జనాలు రక రకాలుగా మాట్లాడు మాట్లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: