టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా అలవైకుంఠపురములో. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్నట్లు టాక్. మురళి శర్మ, బన్నీ తండ్రిగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అక్కినేని సుశాంత్, సునీల్, నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫొటోగ్రఫీని అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కథ విషయమై నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, 

 

అలవైకుంఠపురములో సినిమా కథను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ రిలీజ్ అయిన ఒక సినిమా కథను మూలంగా తీసుకుని తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమా కథను రూపొందించడానికి కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్, సావిత్రిల కాంబినేషన్లో వచ్చిన ఇంటిగుట్టు సినిమా కథను బేస్ గా తీసుకోవడం జరిగిందట. అచ్చంగా అదే మాదిరిగా ఈ సినిమాలో కూడా ఇద్దరు స్నేహితులు ఉండడం, వారికి ఒకేసారి పుట్టిన మగబిడ్డలు ఇద్దరూ కూడా తారుమారు అవడం జరుగుతుంది. 

 

ఇక అదే బేస్ పాయింట్ ని తీసుకున్న త్రివిక్రమ్, ప్రస్తుతం అలవైకుంఠపురములో సినిమాలో హీరో అల్లు అర్జున్ మరియు మరొక నటుడు అక్కినేని సుశాంత్ లపై తెరకెక్కిస్తున్నాడట. వారిద్దరి చిన్నపుడు తారుమారు అవడం, కొంత కథ నడిచిన తరువాత నిజం తెలియడం, ఆపై అసలు తల్లితండ్రుల వద్దకు వారు ఎలా చేరారు అనేది ఈ సినిమా అట. అయితే ఆ కథను నేటి పరిస్థితులకు తగ్గట్లు మంచి కమర్షియల్ అంశాలు కలగలిపి త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం విరివిగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం సంక్రాంతి సమయం వరకు వేచి చూడాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: