ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన బిగ్ బాస్ షో 3వ సీజన్ కొద్దిరోజుల క్రితం ఎంతో వైభవంగా ముగిసింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచిన ఆ షోలో యాంకర్ శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఆ షో జరుగుతున్న సమయంలో శ్రీముఖి మరియు రాహుల్ కొన్ని సందర్భాల్లో ఎంతో గొడవ పడ్డ ఘటనలు ఉన్నాయి. ఇక ఫైనల్ లో రన్నరప్ గా నిలిచి రాహుల్ విన్నర్ గా నిలిచినందుకు శ్రీముఖి కూడా లోలోపల కొంత బాధ పడ్డట్లు సమాచారం. ఇక శ్రీముఖి ఫ్యాన్స్ కూడా ఈ విషయమై స్పందిస్తూ, 

 

రాహుల్ విన్నర్ గా ట్రోఫీ గెలిస్తే, శ్రీముఖి ప్రేక్షకుల మరియు అభిమానుల హృదయాలు గెలిచారు అంటూ తమ అభిప్రాయాన్ని పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెల్పడం జరిగింది. ఇకపోతే అసలు మ్యాటర్ లోకి వెళ్తే, బిగ్ బాస్ షోలో జరిగిన గొడవలు శ్రీముఖి ఇంకా తన మనసులోనే గుర్తుపెట్టుకుంది అనడానికి నిన్న రాహుల్ మీడియా ముఖంగా చేసిన కొన్ని వ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు కొందరు ప్రేక్షకులు. నిన్న ఒక మీడియా చిట్ చాట్ కార్యక్రమంలో శ్రీముఖి గురించి రాహుల్ మాట్లాడుతూ, షోలో తాను శ్రీముఖితో పలు మార్లు గొడవ పడిన మాట వాస్తవమేనని, 

 

అయితే తాను విజేతగా గెలిచిన తరువాత చాలా బిజీగా ఉండడం వలన షోలో పాల్గొన్న కొందరితో మాట్లాడలేకపోయానని అన్నారు. ఇక ఇటీవల ఒకసారి తాను శ్రీముఖి కోసం కాల్ చేస్తే, ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కు వెళ్లిందని ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగిందని అన్నారు. అనంతరం వెకేషన్ నుండి తిరిగి వచ్చిన విషయం తెలుసుకుని మళ్ళీ రెండు రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేయగా, ఆ ఫోన్ ని ఆమె ఫ్రెండ్ తీసిందని, శ్రీముఖి పలు ఫోటో షూట్స్ తో బిజీగా ఉందని చెప్పడం జరిగిందని అన్నారు. అయితే తాను మాత్రం శ్రీముఖిని ఏ మాత్రం తప్పుపట్టడం లేదని, కాకపోతే షోలో జరిగిన కొద్దిపాటి వివాదాలు గుర్తుపెట్టుకుని శ్రీముఖి తనను అవాయిడ్ చేస్తున్నట్లు తాను భావించడం లేదని, అలానే అతి త్వరలో ఆమెని మీట్ అవుతానని రాహుల్ చెప్పడం జరిగింది. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: