టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ క్రేజియెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రేక్షకులు కూడా మెచ్చిన విషయం తెలిసిందే. ఇక యూట్యూబ్ లో ఇప్పటికే నాలుగు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ టీజర్, ఇప్పటివరకు 100 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండడం ఒక పెద్ద రికార్డు అని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. ఇక తమ టీజర్ కు ఇంత భారీ రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సరిలేరు టీమ్ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. 

 

సూపర్ స్టార్ మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. సంగీత, బండ్ల గణేష్, మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి సంయుక్తంగా ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకోవడంతో, తప్పకుండా ఆయన ఈ సినిమా సక్సెస్ తో హ్యాట్రిక్ విజయాలు అందుకోవడం ఖాయం అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇక సినిమాను అన్ని విధాలా సక్సెస్ చేసేలా దర్శకుడు అనిల్ రావిపూడి, సినిమాలో పలు కమర్షియల్ అంశాలతో పాటు, మహేష్ నుండి ఆయన ఫ్యాన్స్ కొద్దికాలంగా మిస్ అవుతున్న ఎంటర్టైన్మెంట్, మాస్ యాక్షన్ ని కూడా బాగా మిళితం చేసినట్లు సమాచారం. ఇక కెరీర్ పరంగా అనిల్ రావిపూడికి కూడా ఇప్పటివరకు ఒక్క అపజయం కూడా లేకపోవడంతో చాలావరకు ఈ సినిమా విజయం సాధించే అవకాశం ఉందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంతమేర సక్సెస్ ని సాధిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: