టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొద్దిరోజుల క్రితం సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మెగాస్టార్ 151వ సినిమాగా తెరకెక్కిన ఆ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో భారీ రేంజ్ లో నిర్మించడం జరిగింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఇటీవల గాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఓవర్ ఆల్ గా యావరేజ్ విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. దాని అనంతరం అతి త్వరలో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. 

 

మెగాస్టార్ 152వ సినిమాగా తెరకెక్కబోయే ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇటీవల ఎంతో వైభవంగా జరిగాయి. జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు టాక్. ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయవలసి ఉంది. కొన్నాళ్ల క్రితం జరిగిన రామ్ చరణ్ మూవీ 'వినయవిధేయ రామ' ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ మాట్లాడుతూ, తన తదుపరి సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే ఉటుందని, తన కోసం త్రివిక్రమ్ ఒక మంచి కథను సిద్ధం చేయబోతున్నట్లు చెప్పారు. అయితే అప్పటినుండి ఆ సినిమాకు సంబంధించి త్రివిక్రమ్ ఒక కథపై కసరత్తు కూడా చేయడం కూడా జరిగిందట. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, 

 

అతి త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్, ముందుగా పింక్ రీమేక్ లో నటించి, దాని తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నట్లు టాక్. అందుకోసం పవన్, తన స్నేహితుడైన త్రివిక్రమ్ ని కలిసి కథ విషయమై చర్చించినట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయమై మెగాస్టార్ కూడా త్రివిక్రమ్ కి ఫుల్ సపోర్ట్ చేసారని, మన సినిమాను కొంచెం లేట్ గా అయినా మొదలెడదాం, ముందు పవన్ సినిమా కోసం కథ సిద్ధం చేయమని చెప్పారట. కాగా నేడు పలు మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: