దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం పై రెండు  బయో పిక్ సినిమాలను  నిర్మిస్తుండగా, ఒక వెబ్ సిరీస్ సైతం కూడా ప్రస్తుతం  నిర్మాణ దశలోనే ఉంది. తమిళ ప్రజలు అమ్మగా ఆరాధించే జయలలిత   గురించే  నిర్మించే ఈ రెండు సినిమాలు , వెబ్ సిరీస్ గురించే  తమిళనాడు లో ఇప్పుడు  ఏ నోటా విన్నా చర్చ జరుగుతుంది . తలైవి పాత్ర లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ , నిత్యా మీనన్ , రమ్యకృష్ణ లు నటిస్తున్నారు . ఈ ముగ్గురి లో అమ్మగా తమిళ ప్రజలను మెప్పించేది ఎవరన్నది హాట్ టాఫిక్ గా మారింది  విజయ్ దర్శకత్వం లో రూపొందిస్తోన్న తలైవి సినిమా లో కంగనా రనౌత్ జయలలిత గా కన్పిస్తోన్న విషయం తెల్సిందే.

 

 కంగనా ఒక పాత్ర చేసేందుకు అంగీకరిస్తే , దానికోసం ప్రాణం పెడుతుందని సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు . అయితే తాజాగా  తలైవి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది . తలైవి గా కంగనా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి . తలైవిగా కంగనా కు మేకప్ సరిగా సూట్ కాలేదని కొందరు అంటూంటే , మరికొందరు నెటిజన్స్ మాత్రం ఆమె హావభావాలు కూడా తలైవి మాదిరిగా లేవంటూ విమర్శలు గుప్పిస్తున్నారు . ఇక నిత్యా మీనన్ అమ్మగా నటిస్తోన్న ఐరన్ లేడీ చిత్రం షూటింగ్ దశ లో ఉంది .

 

తలైవి సినిమా ఫస్ట్ లుక్ పై నిత్యా మీనన్ స్పందిస్తూ జయ లలిత పాత్రకు తానే సరిగ్గా సరిపోతానని, అమ్మ పాత్ర కోసం  తనని తాను ఎంతో మార్చుకున్నని  చెప్పింది . జయలలిత మాదిరిగానే తాను కూడా ఏదైనా ముఖం మీదే చెప్పేస్తానంటున్న నిత్యా మీనన్ …. తాను అమ్మ మాదిరిగా ఉండేందుకు వందశాతం ప్రయత్నిస్తాన ని అంటోంది, ఈ సినిమా ను అభిమానులు కోరుకునే విధంగా తీసుకువస్తానని చెప్పింది .

మరింత సమాచారం తెలుసుకోండి: